టాలీవుడ్ లో మహానటి సినిమా సృష్టించిన సంచలనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆ సినిమా టాలీవుడ్ లో అయినా అటు తమిళం లో అయినా సరే ఒక సంచలనం అనేది వాస్తవం. ఆ సినిమా చూసిన ప్రేక్షకులు కీర్తి సురేష్ ని గుర్తు పెట్టుకుని సావిత్రి ని మర్చిపోయారు. సావిత్రి సినిమాలు అనగానే కీర్తి సురేష్ కళ్ళ ముందు ఉండే విధంగా ఆమె నటించి మెప్పించారు. ఆమె సినిమాల కోసం ఇప్పుడు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు అంటే కచ్చితంగా ఆ సినిమా పుణ్యమే అనేది వాస్తవం. ఆ విధంగా ఆ సినిమా ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. 

 

ఇక ఇది పక్కన పెడితే ఈ సినిమాలో కీర్తి సురేష్ ని దర్శకుడు నాగ్ అశ్విన్ చూపించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది అనే చెప్పవచ్చు. సావిత్రి జీవితాన్ని దగ్గరగా చూసిన వ్యక్తిగా ప్రతీ సీన్ ని ఎంతో అందంగా చేసాడు నాగ్. ప్రతీ సన్నివేశంలో కూడా సావిత్రి ని మర్చిపోయే విధంగా కీర్తి ని చూపించాడు.  కీర్తి మాటలు గాని కీర్తి హావ భావాలు గాని సినిమా మొదట్లో అవకాశాల కోసం చెన్నై వెళ్ళినప్పుడు చేతిలో సంచి పట్టుకుని కీర్తి నడిచిన నడక తెలుగు ప్రేక్షకులకే కాదు తమిళ ప్రేక్షకులకు కూడా ఒక రేంజ్ లో గుర్తుంది. 

 

మహానటి గా కీర్తి జీవించింది అంటూ ఎందరో విమర్శకులు ఆమెను కీర్తించారు. ఇక అక్కడి నుంచి కీర్తి సురేష్ రేంజ్ వేరు అనే విధంగా ఆమె కెరీర్ మారిపోయింది అనేది వాస్తవం. ప్రస్తుతం ఆమె నాలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది. మహేష్ బాబు సినిమాలో ఆమెకు హీరోయిన్ గా ఆఫర్ వచ్చింది. అదే విధంగా ఎన్టీఆర్ సినిమాలో కూడా ఆమెకు ఆఫర్ వచ్చింది అనే వార్తలు వస్తున్నాయి. మరి ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: