ఆమె అందాల రాశి. ఎన్నో సినిమాల్లో నటించి మంచి మార్కులు అటు చిత్ర యూనిట్ వద్ద, ఇటు ఆడియన్స్ వద్ద బాగానే సంపాదించింది. ఇక ఆరేడేళ్ల సీనియారిటీ కూడా ఉంది. ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ లో నటించింది. ఇక కుర్ర కారుకు ఆమె డ్రీం గర్ల్ గా మారింది. అటువంటి అమ్మడు కెమరాను ఫేస్ చేయలేను అంటే నిజంగా షాకే మరి.

 

ఆమె ఎవరో కాదు,  ఉత్తరాదికి చెందిన   భామ లావణ్యా త్రిపాఠి.  ఈ ముద్దు గుమ్మ అందాల  రాక్షసి సినిమాలో నటించింది. తొలి సినిమాతోనే  తన  అందమంతా కుప్పపోసి యూత్ గుండెల్లో కొలువు తీరింది. ఆ తరువాత టాలీవుడ్ మన్మధుడు నాగార్జునతో సోగ్గాడే చిన్ని నాయన మూవీలో నటించి హిట్ పెయిర్ అనిపించుకుంది. భలె భలే మొగాడివోయ్ అంటూ నాని పక్కన కూడా చక్కగా కుదురుకుంది.  కానీ ఇపుడు  లావణ్యా త్రిపాఠికి  ఇపుడు షూటింగ్ అంటే భయం వేస్తోందిట. 

 

ఈ మధ్యనే నిఖిల్ తో అర్జున్ సురవరం మూవీ తో హిట్ కొట్టి  సక్సెస్ ట్రాక్ వైపు కెరీర్ మార్చుకున్న లావణ్యకు ఆఫర్లు మళ్లీ వస్తున్నాయి. అయితే ఈ అమ్మడు మాత్రం షూటింగ్ అంటే బెదురుతోంది. ఎందుకంటే కారణం  కరోనావేనని అంటోంది. కరోనా మహమ్మారి అలాగే పొంచి ఉంది. కరోనాతో కలసి కాపురం చేయాల్సిందేనని అంతా అంటున్నారు.

 

అది ఏ రంగంలో కుదిరినా సినిమా రంగంలో చాలా కష్టమే. ఎందుకంటే షూటింగ్ అంటే తక్కువలో తక్కువ కనీసం వందమంది దాకా ఉంటారు. అంతమందిని పెట్టుకుని షూట్ చేస్తే  వారిలో ఎవరికి కరోనా ఉన్నా మొత్తం షూటింగులో ఉన్న యూనిట్టే  హై రిస్క్ లో పడిపోతుంది. ఇదే విషయాన్ని లావణ్య అంటోంది. షూటింగ్ అంటే ఇష్టమే కానీ కరోనా మహమ్మారి వల్లనే భయమేస్తోంది అంటోంది. ఇది నిజమే కదా. 

 

నిజానికి లావణ్య తన మాటను, బాధను బయటపెట్టేసుకుంది. కానీ అరవీర  విలన్లను ఒంటి చేతో కొట్టే రీల్ హీరోలకు కూడా ఇపుడు అదే బెంగట. మొత్తానికి అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా కరోనా ముప్పు పొంచి ఉండనే ఉంది. ఇదే ఇపుడు సినిమా వారిని బాగా కలవరపెడుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: