కరోనా వచ్చి అందరి ప్లాన్స్ డిస్టర్బ్ చేసింది. సరిలేరు నీకెవ్వరు హిట్ తో ఊపుమీదున్న అనిల్ రావిపూడిని కూడా అడ్డుకుంది. సరిలేరు నీకెవ్వరు రిలీజ్ కాగానే.. ఎఫ్ 3 పనులు మొదలు పెట్టేయాలని అనుకున్నాడు. కథ రెడీగా ఉన్నా.. కరోనా అడ్డుపడి ప్లాన్ మొత్తాన్ని ఫ్లాప్ చేసేసింది.

 

అప్పటి వరకు పటాస్.. సుప్రీమ్.. రాజా ది గ్రేట్ లాంటి హిట్స్ ఉన్న అనిల్ రావిపూడి ఎఫ్ 2 సూపర్ హిట్ తో పెద్ద దర్శకుడు అయిపోయాడు. 70కోట్లకు పైగా షేర్ తీసుకురావడమే కాదు.. ఈ సినిమా నచ్చి అనిల్ కు ఛాన్స్ ఇచ్చి సరిలేరు నీకెవ్వరులో నటించాడు మహేశ్. ఎఫ్ 2 సినిమా ఎండింగ్ లో ఎఫ్ 3 పోస్టర్ వేసి సీక్వెల్ ఉంటుందని ముందే చెప్పేశాడు దర్శకుడు. 

 

ఎఫ్ 2లో ఇద్దరు హీరోలు వెంకటేశ్, వరుణ్ తేజ్ ఉంటే.. ఎఫ్ 3లో మరో హీరో జాయిన్ అవుతాడని ఏడాది క్రితమే దర్శకుడు తెలిపాడు. రాజా ది గ్రేట్ తీసిన అనిల్ రవితేజకు మరోఛాన్స్ ఇస్తాడన్న వార్త వినిపించింది. సరిలేరు నీకెవ్వరు హిట్ తో మహేశ్ తో మంచి సంబంధం ఏర్పడింది. దీన్ని ఉపయోగించుకొని ఎఫ్ 3లో మూడో పాత్రను మహేశ్ తో చేయించే అవకాశం ఉందన్నాయి చిత్రవర్గాలు. రవితేజ, మహేశ్ పేర్లు ఊహాగానాలే గానీ.. మూడో హీరో ఎవరో బయట పెట్టలేదు. 


ఎఫ్ 3లో నటించే మూడో హీరో ఎవరో ఇంకా తేలకున్నా.. అనిల్ రావిపూడి ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నాడు. ఎఫ్ 2 హీరోలు వెంకటేశ్, వరుణ్ తేజ్ కంటిన్యూ అవుతారు కాబట్టి.. వాళ్ల డేట్స్ దృష్టిలో పెట్టుకొని సినిమా స్టార్ట్ చేస్తారు. వెంకటేశ్ నటిస్తున్న నారప్ప.. వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్న మూవీ అక్టోబర్ నాటికి పూర్తవుతాయట. దీంతో ఎఫ్ 3ను నవంబర్ లో స్టార్ట్ చేద్దామనుకుంటున్నారు. 2021 సమ్మర్ కు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: