టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్రస్తుతం ‘నిశ్శబ్దం’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ బ్యాగ్డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాకి హేమంత్‌ మధూకర్‌ దర్శకత్వం వహించాడు. నాలుగు ప్రధాన భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోనా ఫిల్మ్‌ కార్పొరేషన్‌ బ్యానర్లపై కోన వెంకట్‌, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. ఇక అనుష్క భాగమతి తర్వాత వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

ఇక ఈ సినిమాలో అనుష్కతో పాటు మాధవన్‌, అంజలి, షాలినీ పాండే.. ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ అన్ని భాషల ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాని ఏప్రిల్‌ లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ అనుకున్నారు. కాని కరోరానా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ తో సినిమాలన్నిటి తో పాటు నిశబ్ధం కూడా వాయిదా పడింది. అయితే ఇప్పట్లో ఈ సినిమా రిలీజ్ అయ్యో అవకాశాలు లేవని రాసుకొచ్చారు. నాని సినిమా వి, రాం పోతినేని రెడ్ సినిమా, నితిన్ కీర్తి సురేష్ ల రంగ్ దే, మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమా ..ఇలా పోటీకి చాలా సినిమాలు ఉన్నాయి. 

 

ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలని ఓటీటీలో రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్దమయ్యారు.  'నిశ్శబ్దం' సినిమాని ఓటీటీలో విడుదల చేయనున్నారంటూ వార్తలు రాగా అవి వట్టి రూమర్స్ అని చిత్రనిర్మాత కోన వెంకట్ తెలిపారు. ఇక ఈ సినిమా తర్వాత తను దర్శకుడిగా మారబోతున్నారు. ఇన్నాళ్ళు కథా రచయితగా, నిర్మాతగా ఉన్న కోన వెంకట్ ఇప్పుడు డర్శకుడిగా మారబోతున్నానంటూ షాకిచ్చారు. ఇక ఇప్పటికే తను డైరెక్ట్ చేయబోయో సినిమాకి స్క్రిప్ట్ ని కూడా సిద్దం చేసుకున్నారట. త్వరలో నిశబ్ధం రిలీజ్ కాగానే తన సినిమాని అధికారకంగా వెల్లడించనున్నారట. ఇక కాస్ట్ అండ్ క్రూ ని అప్పుడే రివీల్ చేయనున్నట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: