‘భీష్మ’ సూపర్ హిట్ అయిన ఆనందం ఎక్కువరోజులు నితిన్ కు నిలబడలేదు. ఈమూవీ విడుదలై నెలరోజులు గడవకుండానే కరోనా దెబ్బతో ధియేటర్లు అన్నీ మూసుకు పోవడంతో ‘భీష్మ’ కలక్షన్స్ విషయంలో అనుకున్న స్థాయి విజయాన్నిఅందుకోలేకపోయింది. దీనికితోడు ఎన్నో ఆశలతో ఎంతో ఘనంగా చేసుకుందాము అనుకున్న నితిన్ పెళ్ళి కూడ లాక్ డౌన్ సమస్యలతో వాయిదా పడిపోయింది.

 

ఈ షాక్ ల నుంచి తేరుకుని త్వరలో షూటింగ్ లు మొదలుకాబోతున్న పరిస్థితులలో నితిన్ తన సొంత బ్యానర్ పై నిర్మించబోతున్న బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘అంధాదున్’ తెలుగులో రీమేక్ షూటింగ్ ను ప్రారంభించదానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి తన హిట్ ట్రాక్ ను కొనసాగించాలని నితిన్ చేస్తున్న ప్రయత్నాలకు క్రేజీ బ్యూటీ కీర్తి సురేశ్ నుండి ఊహించని సమాధానం వచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి.

 

తెలుస్తున్న సమాచారం మేరకు హీరోయిన్ పాత్రకు ఎంపిక అయిన కీర్తి సురేశ్ నితిన్ తో నటించే విషయంలో కొన్ని డిమాండ్స్ పెడుతున్నట్లు టాక్. ఈ మూవీ కథ రీత్యా కొన్ని లిప్ లాక్ సీన్స్ కీలకం కావడంతో ఆ సీన్స్ లో ప్రస్తుతం తాను నటించనని కీర్తి స్పష్టంగా తెలియచేసింది అని అంటున్నారు.

 

అంతేకాదు కరోనా సమస్యల తరువాత చిత్రీకరణ ప్రారంభం అవ్వబోయే ఏ సినిమాలోను తాను హీరోతో అత్యంత సన్నిహితంగా ఉండే సీన్స్ లో కూడ తాను నటించను అన్న క్లారిటీ కీర్తి సురేశ్ నుండి వచ్చింది అంటూ గాసిప్పులు వస్తున్నాయి.అదేవిధంగా అదేవిధంగా ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించడానికి ఎంపిక అయిన ‘గ్యాంగ్ లీడర్’ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ కూడ నితిన్ తో లిప్ లాక్ సన్నివేశాలలో నటించడానికి నో చెప్పింది అంటూ గాసిప్పులు హడావిడి మొదలు కావడంతో ఇది అంతా హీరోయిన్స్ కు కరోనా వల్ల వచ్చిన జ్ఞానోదయమా అంటూ ఇండస్ట్రీ వర్గాల టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: