సినీ ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్లు అందం.. అభినయం ఉన్నా అదృష్టం అనేది కలిసి రాక ఎన్ని చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు ఉండదు. ఒకలైలా కోసం, ముకుంద చిత్రాలతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ అచ్చమైన తెలుగు అమ్మాయిగా మంచి సాంప్రదాయంగా కనిపించింది.  ఈ రెండు చిత్రాల్లో గ్లామర్ కి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. దాంతో తదుపరి చిత్రాల్లో ఛాన్స్ రాకుండా పోయింది.  కానీ దువ్వాడ జగన్నాథం చిత్రం తర్వాత ఈ అమ్మడి అదృష్టం ఓ రేంజ్ కి చేరింది. ఈ చిత్రంలో బ్లాక్ బికినీతో కుర్రాళ్లకు పిచ్చెక్కించింది.  ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ దుమ్మురేపుతుంది.  వరుస హిట్లతో ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది.

 

గ్లామర్ పాత్రలకు  కేరాఫ్ అడ్రస్ అయిపోయింది. దీంతో ఆటోమేటిక్ గానే అమ్మడి పారితోషికం కూడా పెరిగిపోయింది. అయినప్పటికీ, పూజానే కావాలంటూ దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం చూస్తున్నారు. అల్లు అర్జున్, నాగచైతన్య,ఎన్టీఆర్, మహేష్ బాబు, వరుణ్ తేజ్ తో నటించింది. ఇప్పుడు రాదకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ సరసన నటిస్తుంది.  తెలుగు లో అందరు టాప్ హీరోలతో నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతుంది.

 

త్వరలో సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందే 'కబీ ఈద్ కబీ దివాలీ' చిత్రంలో, అక్షయ్ కుమార్ నటించే 'బచ్చన్ పాండే' చిత్రంలోనూ హీరోయిన్ గా నటించడానికి పూజ ఇప్పటికే డేట్స్ ఇచ్చేసింది. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రంలోనూ నటిస్తోంది. తాజాగా దుల్ఖర్ సల్మాన్ సరసన హీరోయిన్ గా నటించడానికి ఓకే చెప్పింది. హను రాఘవపూడి దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని అశ్వనీదత్ కూతుర్లు స్వప్నా దత్, ప్రియాంక దత్ కలసి నిర్మిస్తారు.  ఇలా టాలీవుడ్, బాలీవుడ్ లో వరుస ఛాన్సులు దక్కించుకుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: