లాక్ డౌన్ వల్ల గత రెండు నెలలనుండి సినిమా , సీరియళ్ల షూటింగ్ స్తంభించిపోయాయి. విడుదలకావల్సిన సినిమాలు వాయిదాపడ్డాయి. ఈపరిస్థితి ఇలాగే కొనసాగితే  సినీ కార్మికులు రోడ్డున పడే అవకాశాలు ఉండడం తో ఇటీవల సినీ పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమై  షూటింగ్ లకు పర్మిషన్ ఇవ్వాలని కోరడం తో సీఎం సానుకూలంగా స్పందించారు. జూన్ నుండి  షూటింగ్  లు జరుపుకోవచ్చని అయితే కొన్ని నిబంధనలు  మాత్రం తప్పకుండా పాటించాలని సూచించారు. దాంతో జూన్ నుండి మళ్ళీ షూటింగ్ లు మొదలుకానున్నాయి. 
 
 
అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య కొత్త షెడ్యూల్ జూన్ 15నుండి హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో రెండు పాటల తోపాటు ఓ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించనున్నారట. త్వరలోనే ఈషెడ్యూల్ కు సంబందించిన సెట్స్ పనులు మొదలు కానున్నాయి. టాప్  డైరెక్టర్  కొరటాల శివ డైరెక్షన్ లో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్ కథానాయికగా నటిస్తుండగా ప్రముఖ  బాలీవుడ్ నటుడు సోను సూద్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
 
 
మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్ టైమెంట్స్ ,కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ల పై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రంఆగస్టు 14న విడుదలకావాల్సి ఉండగా  కరోనా వల్ల షూటింగ్ ఆలస్యంగా పూర్తి కానుండడం తో వచ్చే ఏడాది సంక్రాంతి కి ఈసినిమా ను థియేటర్లలోకి  తీసుకురానున్నారు. ఈసినిమా తరువాత చిరు, సాహో డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ లో లూసిఫర్ రీమేక్ లో నటించనున్నాడు. ప్రస్తుతం సుజీత్  స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో వున్నాడు.   

మరింత సమాచారం తెలుసుకోండి: