ఇస్మార్ట్ శంకర్ తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కినా డేరింగ్ అండ్ డ్యాషిండ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ ఆ సినిమాతో తన సత్తా ఏంటో చూపించాడు. అంతేకాదు రామ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ కూడా ఇచ్చాడు. ఇక అదే జోష్ తో ఈసారి రౌడీ హీరో విజయ్ దేవరకొండలో సినిమా చేస్తున్నాడు పూరి జగన్నాథ్. ఈసారి పాన్ ఇండియా మూవీని సెట్ చేశాడు. విజయ్ దేవరకొండకు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ తో పాటుగా మనోడి క్రేజ్ బాలీవుడ్ దాకా పాకడంతో.. విజయ్ సినిమా ఐదు భాషల్లో రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. 

 

ఈ సినిమాను హిందీలో కరణ్ జోహార్ రిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇదిలాఉంటే ఈ సినిమా షూటింగ్ టైం లో పూరి వర్కింగ్ స్టయిల్ కు ఫిదా అయినా కరణ్ జోహార్ పూరికి మరో మూవీ ఛాన్స్ ఇచ్చాడని అంటున్నారు. అయితే ఆ సినిమా పూర్తిగా బాలీవుడ్ లో చేయాలని చెప్పాడట. పూరి మాత్రం విజయ్ సినిమా తర్వాత సౌత్ హీరోతోనే మరో పాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడట. ఐతే పూరి ఈసారి ఎవరితో పాన్  ఇండియా మూవీ చేస్తాడా అని అందరు ఎక్సయిటింగ్ గా ఉన్నారు. 

 

అసలైతే మహేష్ ఒప్పుకోవాలి కానీ జనగణమన సినిమా చేయాలని ఎప్పటినుండో ప్రయాత్నిస్తున్నాడు పూరి. ఆ సినిమాకు ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ కూడా రెడీ అయ్యింది. అయితే మధ్యలో వరుస ప్లాపులు తీయడంతో మహేష్ పూరిపై నమ్మకం పెట్టలేకపోయాడు. అదే విషయంపై పూరి మహేష్ మీద నెగటివ్ కామెంట్స్ కూడా చేశాడు. మరి విజయ్ సినిమా తర్వాత పూరి చేసే పాన్ ఇండియా మూవీ ఎవరితో.. ఆ సినిమా ఎలా ఉంటుంది అన్న విషయాల మీద మరికొద్దిరోజుల్లో క్లారిటీ వస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: