కొద్దిపాటి గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వకీల్ సాబ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపిస్తుండగా సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అసలైతే లాక్ డౌన్ లేకపోతె ఈ టైం కు పవర్ స్టార్ వకీల్ సాబ్ రిలీజ్ కావాల్సింది. కానీ సినిమా అనుకోకుండా వాయిదా పడ్డది. 

 

ఈమధ్యనే తెలంగాణా ప్రభుత్వం షూటింగ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ ఎండింగ్ లేదా జూలై మొదటివారం నుండి షూటింగ్స్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో పవన్ సినిమా షూటింగ్ కూడా జూలైలో మొదలవుతుందని తెలుస్తుంది. ఇప్పటికే చాలావరకు పూర్తైన ఈ సినిమా త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తారట. తెలుస్తున్న సమాచారం ప్రకారం వకీల్ సాబ్ సినిమా ఈ ఇయర్ దసరాకి రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. పవర్ స్టార్ సినిమా రిలీజ్ అంటే ఆ సందడి వేరేలా ఉంటుంది. దసరాకి ఆ సందడి షురూ అవుతుంది. తప్పకుండా ఫ్యాన్స్ అంచనాలను అందుకునేలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. 

 

సినిమా తర్వాత పవర్ స్టార్ క్రిష్ డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలిసిందే. ఆ సినిమా పిరియాడికల్ మూవీగా రాబోతుందని తెలుస్తుంది. ఈ మూవీని శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. తప్పకుండా పవర్ స్టార్ ఫ్యాన్స్ కు మళ్ళీ పండుగ చేసుకునేలా పవర్ స్టార్ వరుస సినిమాలు వస్తాయని తెలుస్తుంది. ఇక గబ్బర్ సింగ్ డైరక్టర్ హరీష్ శంకర్ తో కూడా పవన్ కళ్యాణ్సినిమా ఫిక్స్ చేసుకున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారని తెలుస్తుంది. ఈ మూడు సినిమాలు ఏమాత్రం గ్యాప్ లేకుండా పూర్తి చేసేలా చూస్తున్నాడు పవన్ కళ్యాణ్. లాక్ డౌన్ ఎత్తేయగానే షూటింగ్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: