టాలీవుడ్ లో ఇప్పుడు సినిమాల షూటింగ్ కోసం టాలీవుడ్ పెద్దలతో పాటుగా టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాల షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారు అనే దాని మీద త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జూన్ నుంచి షూటింగ్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. ఇటీవల తెలంగాణా సర్కార్ కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పింది. ముందు తెలంగాణాలోనే షూటింగ్ లు చేద్దామని సినీ పెద్దలకు కేసీఆర్ సూచనలు కూడా చేసిన సంగతి తెలిసిందే. 

 

ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు కొందరు హీరోలు ఇతర రాష్ట్రాల్లో షూటింగ్ లు చేయడానికి అనుమతులు అడుగుతున్నారు. చిరంజీవి సినిమా ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గోదావరి తీరంలో షూటింగ్ చేయడానికి గానూ ఇప్పటికే ఏపీ సర్కార్ ని చిరంజీవి అడిగారు అని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. సిఎం వైఎస్ జగన్ కూడా ఇందుకు ఓకే చెప్పినట్టు సమాచారం. ఇక ఆయనతో పాటుగా మహేష్ బాబు కూడా ఏపీ లో సినిమా సినిమా షూటింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. 

 

ఇక కొందరు స్టార్ హీరోలు కూడా ఏపీలో సినిమా ల షూటింగ్ ల కోసం ఇప్పుడు కాస్త గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు . ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడి లోనే ఉంది కాబట్టి తాము జాగ్రత్తగా సినిమాలను షూటింగ్ చేసుకుంటామని అడిగారని సమాచారం. మరి దీనికి ఏపీ సర్కార్ ఏమంటుందో చూడాలి. కాగా ఇప్పటికే ఏపీలో సినిమాల షూటింగ్ కి సింగిల్ విండో అనుమతులను ఏపీ సర్కార్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి సినిమాల షూటింగ్ ల విషయంలో ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు అనేది త్వరలోనే తెలుస్తుంది. కాగా చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: