టాలీవుడ్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘పిదా’ మూవీతో అందరి మనసు దోచింది సాయి పల్లవి. మాలీవుడ్ లో ప్రేమమ్ మూవీతో కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది. గతంలో తెలుగు లో ఓ డ్యాన్స్ రియాల్టీ షోలో పాల్గొన్న సాయి పల్లవి తిరిగి తమ కళ్లముందు హీరోయిన్ గా ప్రత్యేక్షం అవుతుందని ఎవరూ ఊహించలేకపోయారు. సాయి పల్లవి ఎంతో నేచురల్ గా కనిపిస్తుంది..అంతే కాదు తాను మేకప్ వేసుకోకుండానే నటిస్తుందని అంటుంటారు. ఇక కెరీర్ పరంగా తెలుగులో వచ్చిన ఫిదా తర్వాత మరికొన్న మూవీస్ లో కనిపించింది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న ‘లవ్ స్టోరీ’, రానా నటిస్తున్న విరాట పర్వం మూవీలో నటించింది.
ఈ మూవీస్ త్వరలో రీలీజ్ కాబోతున్నాయి. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్, సినిమాలు రిలీజ్ కాకుండా ఉన్నాయి. తక్కువ కాలంలోనే మంచి సినిమాల్లో అవకాశాలు రావడంతో టాలీవుడ్ టాప్ హీరోయిన్ల జాబితాలో తనకంటూ పేరు కొట్టేసింది. ఈ భామ రెమ్యునరేషన్ విషయంలో సమంత, అనుష్కను వెనక్కి నెట్టేసిందట. పడిపడి లేచె మనసు సినిమాకు సాయిపల్లవి రూ.1.40 కోట్లు డిమాండ్ చేసిందట. ప్రస్తుతం టాప్ హీరోయిన్లుగా ఉన్న సమంత, కాజల్, అనుష్క శెట్టి, త్రిష కూడా తమ కెరీర్ తొలినాళ్లలో ఇంత పెద్ద మొత్తంలో డిమాండ్ చేయలేదు.
అంతే కాదు అతి తక్కువ కాలంలో ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకోవడం దక్షిణాది హీరోయిన్లలో సాయి పల్లవి కి టాప్ అని అంటున్నారు. కెరీర్ కొద్ది సమయంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటిగా నిలిచింది సాయిపల్లవి. ఈ భామ ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి లవ్స్టోరీ మూవీలో నటిస్తోంది. ఏది ఏమైనా ఈ బ్యూటీ నిజంగా గ్రేటే అంటున్నారు.