తెలుగు సినిమా రంగం టాప్ నిర్మాతల్లో ఒకరు దిల్ రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ అధినేతగా నిర్మాత దిల్ రాజు సారధ్యంలో సంవత్సరానికి కనీసం ఐదు గాని ఆరు గాని సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అంతే కాకుండా సినిమాల డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తుంటారు. అలాగే నెక్స్ట్ చేయబోయే సినిమాల పనులు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఇటీవల కరోనా వైరస్ రావటంతో ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో అన్ని పనులు ఆగిపోయాయి. ఇదిలా ఉండగా దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో నేచురల్ స్టార్ నాని నటించిన ‘వి’ సినిమా సరిగ్గా రిలీజ్ టైమ్ లో లాక్ డౌన్ విధించడంతో రిలీజ్ వాయిదా పడింది. అయితే ఇటీవల ప్రభుత్వాలు సినిమా షూటింగులకు చేసుకోవచ్చని పర్మిషన్ ఇచ్చే విధంగా ఇండస్ట్రీ పెద్దలు మంతనాలు జరుపుతున్న తరుణంలో ‘వి’ సినిమా రిలీజ్ గురించి ఇండస్ట్రీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.  

 

సినిమా థియేటర్ల విషయంలో ప్రభుత్వాల నుండి సరైన విధంగా రెస్పాండ్ రాకపోవడంతో ‘వి’ సినిమా ఓటిటి లో రిలీజ్ చేయాలని సోషల్ మీడియాలో అభిమానులు గోల గోల చేస్తున్నారు. అయితే ఈ విషయంపై న్యాచురల్ స్టార్ నాని కూడా ఓటిటి ద్వారా సినిమా రిలీజ్ చేస్తే బాగుంటుందని కానీ నిర్మాత దిల్ రాజు చేతిలోనే సినిమా రిలీజ్ అంశం ఉందని సన్నిహితులతో అన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.

 

మరోపక్క ఉన్న కొద్ది సినిమా లేట్ అవుతున్న తరుణంలో ఓటిటి రంగంలో ఆఫర్స్ వస్తున్న గాని దిల్ రాజు  ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించకపోవడం పై నాని గరం గరం అవుతున్నట్లు సమాచారం. ‘వి’ సినిమా ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటిటి ద్వారా రిలీజ్ చేసే ప్రసక్తి లేదని సినిమా థియేటర్ ద్వారా మాత్రమే రిలీజ్ చేస్తానని సన్నిహితులతో దిల్ రాజు అన్నట్లు సమాచారం. దీంతో సినిమా ఆగస్టు లేదా సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: