ఇంతకుముందు సినిమాలలో మల్టీస్టారర్ మూవీలు ఎక్కువగా వచ్చేవి. అయితే రాను రాను టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలు పూర్తిగా పడిపోయి. అయితే గత 5 - 6 సంవత్సరాలుగా మళ్లీ టాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాలకు క్రేజ్ ఏర్పడింది. నిజానికి టాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాలకు మళ్లీ ఊపు ఇచ్చిన హీరో ఎవరంటే విక్టరీ వెంకటేష్ అని చెప్పాలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మొదలు పెట్టిన మల్టీస్టారర్ చిత్రాలు అప్పటినుంచి బాగా కొనసాగుతూ వస్తున్నాయి. అయితే ఈ వరుసలో విక్టరీ వెంకటేష్ ముందంజలో ఉన్నారని చెప్పవచ్చు. సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అలాగే హీరో రామ్ తో మసాలా, గత సంవత్సరం వరుణ్ తేజ్ తో నటించిన ఎఫ్ 2, అలాగే తన మేనల్లుడు నాగ చైతన్య తో నటించిన వెంకీ మామ అన్ని చిత్రాలు మంచి హిట్ సాధించాయి. ఇందులో మసాలా ఒకటి కాస్త నిరాశపరిచింది అని చెప్పవచ్చు. 

 


ఇక అసలు విషయంలోకి వెళితే.... ఇప్పుడు వెంకటేష్ తో పాటు నేచురల్ స్టార్ నాని కూడా కలిసి నటించేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు టాలీవుడ్ ఫిలిం వర్గాలలో వార్త వినపడుతోంది. ఇప్పుడు వీళ్లిద్దరు కలిసి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో అదిరిపోయే స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ తో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఇకపోతే దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయడానికి స్క్రిప్టు రెడీ చేసి సిద్ధంగా ఉన్నాడు. ఇక ఆ ప్రాజెక్టు త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. 

 


ఇక మరోవైపు విక్టరీ వెంకటేష్ కూడా ప్రస్తుతం నారప్ప, ఎఫ్3 చిత్రాలతో పాటు తరుణ్ భాస్కర్ తో మరో సినిమా చేయాల్సి ఉంది. ఇక మరోవైపు నాచురల్ స్టార్ నాని కూడా నాలుగు కొత్త ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నాయి. ఒకవేళ ఈ స్క్రిప్ట్ మీద అన్నీ అనుకూలించి సినిమా మొదలు పెట్టాలన్నా ఇంకా చాలా సమయం పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: