టాలీవుడ్ లో ఉన్న సక్సస్ ఫుల్ డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి ఒకరు. ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ రాలేదన్న సంగతి తెలిసిందే. నందమూరి కళ్యాణ్ రాం తో తెరకెక్కించిన పటాస్ నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు తో తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు సినిమా వరకు ఒకదాని తర్వాత ఒకటి మంచి కమర్షియల్ సక్సస్ లుగా నిలిచాయి. ఇండస్ట్రీలో సక్సస్ ఫుల్ డైరెక్టర్స్ గా రాజమౌళి, కొరటాల శివ తర్వాత ఆ క్రెడిట్ అనిల్ రావిపూడి సాధించాడు.

 

అయితే ఈ సక్సస్ ఫుల్ డైరెక్టర్ కి ఇప్పుడు పెద్ద సమస్య వచ్చిందని తెలుస్తుంది. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లతో ఇంతక ముందు అనిల్ రావిపూడి ఎఫ్ 2 ని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోను చేరింది. దాంతో ఈ మల్టీస్టారర్ కి సీక్వెల్ గా ఎఫ్ 3 ని నిర్మించాలని దిల్ రాజు ప్లాన్ చేశాడు. అయొతే ఈ మద్యలో అనిల్ రావిపూడి దిల్ రాజు సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు చేశారు. ఆ తర్వాత ఎఫ్ 3 అనుకున్నారు. ఇందులో మహేష్ బాబు నటిస్తాడని వార్తలు వచ్చాయి. 

 

అయితే ప్రస్తుతం కరోనా తో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈ సినిమా ఈ సంవత్సరం పట్టాలెక్కే అవకాశాలేమీ లేవని తాజా సమాచారం. ఇప్పటికే దిల్ రాజు నిర్మాణం లో రూపొందిన వకీల్ సాబ్, వి సినిమాలు రిలీజ్ కి సిద్దంగా ఉన్నాయి. ఇక వెంకటేష్ ప్రస్తుతం నారప్ప కంప్లీట్ చేయాల్సి ఉంది. అలాగే వరుణ్ తేజ్ బాక్సర్ సినిమాని కంప్లీట్ చేయాలి. ఈ రెండు సినిమాలు కంప్లీటయ్యో సరికే 2021 వచ్చేస్తుందని అంటున్నారు.

 

అయితే అనిల్ రావిపూడి నందమూరి బాలకృష్ణ తోను రామారావు అన్న టైటిల్ తో సినిమా చేయబోతున్నాడన్న వార్త వచ్చింది. కాని ఇంకా అధికారకంగా ఏ విషయం తెలీలెదు. అయితే బాలయ్య ప్రస్తుతం బోయపాటితో సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత పూరి సినిమాలో నటిస్తాడని తెలుస్తుంది. మరి అనిల్ రావిపూడి సినిమా ఏదో ప్రస్తుతానికి క్లారిటి లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: