మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ బన్నీ ‘అల వైకుంఠపురములో’ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. గతంలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురములో’ సినిమాతో మర్చిపోలేని బ్లాక్ బస్టర్ హిట్ బన్ని కెరీర్ లో ఇచ్చారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగకు రిలీజ్ అయిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తర్వాత బన్నీ నటించిన ఈ సినిమాకు అభిమానులు మరియు తెలుగు సినిమా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

 

దీంతో మళ్లీ త్రివిక్రమ్ తో బన్నీ సినిమా చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్.... ఎన్టీఆర్ మరియు పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సమయంలో వాళ్ళతో కుదరకపోతే మాత్రం నేను రెడీగా ఉన్నాను అని త్రివిక్రమ్ కి బన్నీ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. మరోపక్క త్రివిక్రమ్ వెంకటేష్, రామ్ చరణ్ తో కూడా ప్రయత్నాలు చేస్తున్నారట. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే సినిమా చేస్తున్నారు.

 

ఇది ఇంకా స్టార్టింగ్ దశలోనే ఉంది. ఇటువంటి సమయంలో సినిమా ఇంకా పూర్తి కాకముందే త్రివిక్రమ్ తో సినిమా అనే వార్త రావడంతో ఈ సినిమా సెట్ అవ్వాలి అని బన్నీ ఫ్యాన్స్ దేవునికి  మొక్కుతున్నరు. బన్నీ ఇచ్చిన లాంగ్  గ్యాప్ కి ఈ కాంబినేషన్లతో బాక్సాఫీస్ దగ్గర బాకీ తీర్చేయాలని కోరుకుంటున్నారు. మరోపక్క ‘పుష్ప’ సినిమా తో పాటు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో ‘ఐకాన్’ అనే సినిమా కూడా లైన్ లో పెట్టడం జరిగింది. ఇటువంటి సమయంలో త్రివిక్రమ్ సినిమా ఓకే అయితే మళ్లీ ఏ విధంగా ముందుకు వెళ్తాడో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: