యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'జిల్' ఫేమ్ krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ మరియు గోపీ కృష్ణ మూవీస్‌ బ్యానర్లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పీరియాడిక్ లవ్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో 'బుట్ట బొమ్మ' పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. 'సాహో' వంటి భారీ చిత్రం తరువాత ప్రభాస్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌ లో నెలకొన్నాయి. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నెలకొనియున్న పరిస్థితుల వలన చిత్రీకరణ ఆపేసుకుంది.

 

పాన్ ఇండియా మూవీ కావడంతో పలువురు ఇతర ఇండస్ట్రీ నటులు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ ఈ మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇంకా పేరు ఖరారు చేయని ఈ చిత్రానికి 'ఓ డియర్' 'రాధే శ్యామ్' అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ రెండు గెటప్స్ లో కనిపిస్తారని.. పీరియాడిక్‌ నేపథ్యంలో వచ్చే ఓల్డ్ గెటప్ లో.. అదేవిదంగా ప్రస్తుత కాలానికి సంబంధించి మరో గెటప్ లో ప్రభాస్ కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ అంనౌన్సమెంట్స్ ఉగాది కానుకగా ఇవ్వాలని చిత్ర యూనిట్ భావించారు. కానీ దేశ వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన వాయిదా వేసుకున్నారు. 

 

ఇదిలా ఉండగా ఇంతవరకు ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ కన్ఫర్మ్ కాలేదు. మొదటగా ఈ సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ అందులో ఏమాత్రం నిజం లేదని.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమిత్ త్రివేది కూడా క్లారిటీ ఇచ్చారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రభాస్ 20వ సినిమాకి సంగీతం ఎవరు అందిస్తారనే.. విషయం పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గత చిత్రం 'సాహో' విషయంలో కూడా మొదట ఇలాంటి కన్ఫ్యూజనే ఏర్పడింది. ఈ సినిమాకి ఐదుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసారు.

 

తనిష్క్ బాఘ్చి, గురు రంధ్వా, బాద్షా, శంకర్ ఎషాన్ లాయ్ సాంగ్స్ అందించగా జిబ్రాన్ నేపథ్య సంగీతం అందించారు. ‘సాహో’ మాదిరే నాన్చి నాన్చి చివర్లో ఎవరో ఒకరితో హడావుడిగా పని చేయించి పాటల్ని చెడగొడతారేమో అన్న ఆందోళన ప్రభాస్ అభిమానుల్లో వ్యక్తమవుతోందట. కాగా ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరో విషయం ఏంటంటే ప్రభాస్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఏఆర్ రెహమాన్ కావడం విశేషం. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: