ఇప్పుడు హైదరాబాద్ లో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. కరోనా కట్టడి కోసం చర్యలు చేపట్టి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే హైదరాబాద్ లో మాత్రం కేసులు ఆగే అవకాశాలు ఏ విధంగా చూసినా సరే కనపడటం లేదు. తాజా అప్ డేట్స్ ప్రకారం చూస్తే ఒక్క తెలంగాణ లోనే కరోనా కేసులు ఏకంగా 2 వేలకు పైగా పెరిగిపోయాయి. ఇక తెలంగాణ లో నమోదు అవుతోన్న కేసుల్లో ఎక్కువ కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదు అవుతున్నాయి.
ఈ నేపధ్యంలోనే కొందరు ఇప్పుడు హైదరాబాద్ ని ముంబై అయ్యే అవకాశం ఉందనే కామెంట్స్ ఎక్కువగా చేస్తున్నారు. ఇదే ఇప్పుడు హీరోయిన్ లను బాగా ఇబ్బంది పెట్టే అంశం అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే సినిమా షూటింగ్ లను మొదలుపెట్టే ఆలోచనలో టాలీవుడ్ ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే సినిమా షూటింగ్ లకు సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలను కూడా రిలీజ్ చేసేలా సిద్దం చేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ముందుగానే హీరోయిన్ లు సొంత ప్రాంతాల నుంచి హైదరాబాద్ రావాలని సూచనలు చేశారు.
అయతే హైదరాబాద్ ఇప్పుడు వచ్చే అవకాశం లేదని వాళ్ళు భయపడుతున్నారట. హైదరాబాద్ లో కేసులు ఎక్కువగా ఉన్నాయని తాను రాలేను అని కొన్ని రోజులు ఆగాలని కాజల్ చెప్పినట్టు సమాచారం. అలాగే పూజ హెగ్డే ... రష్మిక మందన కూడా ఇదే విషయాన్ని చెప్పెసినట్టు తెలుస్తోంది. సమంతా హైదరాబాద్ లోనే ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. మరి ఎంత మంది హీరోయిన్ లు షూటింగ్ లకు వస్తారో ? ఎంత మంచిది వచ్చే అవకాశం లేదో అనేది తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక టాలీవుడ్ షూటింగ్లు తిరిగి ప్రారంభ మయ్యేలా తెలుగు సినిమా ప్రముఖులు అందరూ ఇప్పటికే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు సీఎం కేసీఆర్ ను కలిసి అనుమతులు పొందిన సంగతి తెలిసిందే.