త్రివిక్రమ్ ఎన్టీఆర్... ఈ కాంబినేషన్ కి వచ్చిన గుర్తింపు గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఒక్కటే అయినా సరే అది కొట్టిన హిట్ మాత్రం మాములుగా లేదు. త్రివిక్ర‌మ్ అజ్ఞాత వాసి లాంటి డిజాస్ట‌ర్ సినిమా త‌ర్వాత తెర‌కెక్కించిన సినిమా అది. అజ్ఞాత వాసి రిజ‌ల్ట్ చూసిన స్టార్ హీరోలు అస‌లు త్రివిక్ర‌మ్ తో సినిమా చేసేందుకే ఎవ్వ‌రూ సాహ‌సించ‌ని ప‌రిస్థితి ఉంది. ఆ టైంలో ఎన్టీఆర్ ధైర్యం చేసి త్రివిక్ర‌మ్‌కు మంచి ఛాన్స్ ఇచ్చి హిట్ కొట్టాడు. ఇక ఈ కాంబినేషన్ కోసం చాలా రోజుల నుంచి వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న వారికి మంచి విజయాన్ని ఇచ్చేసింది. ఇక ఇప్పుడు ఈ కాంబినేషన్ లో మరో సినిమా సెట్స్ మీదకు రావడానికి సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే. 

 

ఇక ఇప్పుడు ఈ సినిమాలో విలన్ గా తమిళ హీరో మీద కన్నేశారు. ఈ సినిమాను పాన్ ఇండియా సినిమా రేంజ్ లో తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయట‌. అందుకే కోలీవుడ్ మార్కెట్ కోసం ఈ సినిమా లో విలన్ గా విజయ్ సేతుపతి అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. విజయ్ సేతుపతిని తీసుకునే విషయంలో ఇప్పటికే త్రివిక్రమ్ కూడా ఆసక్తి చూపించినట్టు తెలుస్తుంది. త్వరలోనే అతని ఫస్ట్ లుక్ కూడా వచ్చే సూచనలు కనపడుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా కథను రెడీ చేస్తున్నారు. 

 

దాదాపుగా కథ సిద్దంగా ఉందని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ చిన్న చిన్న మార్పులు చెప్పడం తో దానిని మార్పులు చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే ఈ సినిమాలో హీరోయిన్ ని కూడా అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ లో టాక్. పూజా హెగ్డే పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఇక సినిమాను ఖ‌చ్చితంగా హిట్ చేయాల‌ని చిత్ర యూనిట్ ఇప్పటికే కొన్ని కొన్ని జాగ్రత్తలను తీసుకుంటూ చిన్న చిన్న కార్యక్రమాలను మొదలుపెట్టినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: