ప్లాపుల్లో వున్న డైరెక్టర్లకు
మాస్ మహారాజ్
రవితేజ వరంలా మారాడు. అతనితో సినిమాలు చేసి హిట్లు కొట్టి ట్రాక్ లోకి రావాలని భావిస్తున్నారు మీడియం రేంజ్ డైరెక్టర్లు. ఈజాబితాలో చాలా మంది డైరెక్టర్లే వున్నారు అందులో గోపిచంద్ మలినేని ఒకరు.
విన్నర్ తో దెబ్బ తిన్న గోపిచంద్ ప్రస్తుతం
రవితేజ తో
క్రాక్ అనే
సినిమా చేస్తున్నాడు. రెండు పాటలు మినహా షూటింగ్ కూడా పుర్తయింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రుతీ హాసన్
హీరోయిన్ గా నటిస్తుండగా
థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. ఈసినిమాతో హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని గోపిచంద్ పట్టుదలతో వున్నాడు. ఇంతకుముందు బలుపు రూపంలో
గోపిచంద్ మలినేని ఓ భారీ హిట్ ఇవ్వడంతో
క్రాక్ పై
రవితేజ కూడా భారీ ఆశలు పెట్టుకున్నాడు
ఇక ఈసినిమా తరువాత రవితేజ , నాపేరు సూర్య తో డైరెక్టర్ గా మారిన కథా రచయిత వక్కంతం వంశీ తో సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి నిర్మాత కూడా దొరికాడు. ఏకే ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై అనిల్ సుంకర ఈసినిమాను నిర్మించనున్నాడు. త్వరలోనే ఈసినిమా లాంఛ్ కానుంది. మొదటి సినిమా తోనే భారీ పరాజయాన్ని చవిచూసిన వంశీ, రవితేజ తో హిట్ కొట్టి డైరెక్టర్ గా నిలదొక్కుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమాలే గాక మరో రెండు సినిమాలకు కూడా రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అందులో ఒకటి రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ తో చేయనునున్నాడు. మరొకటి సినిమా చూపిస్త మావ , నేను లోకల్ ఫేమ్ త్రినాథ రావు నక్కిన డైరెక్షన్ లో చేయనున్నాడు. వీరిద్దరికి కూడా ఓ భారీ హిట్ ఆవసరం. త్వరలోనే ఈసినిమాల గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.