తమిళ, తెలుగు ఇండస్ట్రీలో తనకంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సూర్య.  తండ్రి శివకుమార్ తమిళ నటుడు ఆయన వారసుడిగా వెండితెరపై అడుగు పెట్టిన సూర్య ‘గజిని’తో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ సంపాదించాడు. ఆ తర్వాత తెలుగు లో సింగం సీరీస్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు.  తాజాగా నటుడు సూర్య గాయాల పాలైనట్లు ప్రచారం జరుగుతోంది.  లాక్‌డౌన్‌ కాలంలో సూర్య వర్కౌట్‌ చేస్తుండగా గాయాల పాలయ్యారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరుగా సాగుతోంది.  ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.  తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. అయితే దీనిపై సూర్య బంధు వర్గాలను విచారించగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగతున్నట్లు పెద్దగా గాయాలేమీ కాలేదని చెప్పారు.

 

కానీ  ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దాంతో సూర్య ఫ్యాన్స్ ఆందొళనకు గురి అయ్యారు. సుధ కొంగర దర్శకత్వంలో సూరారై పొట్రు చిత్రాన్ని పూర్తిచేసిన సూర్య ఆ చిత్ర విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. అదే విధంగా ఆయన భార్య జ్యోతిక హీరోయిన్ గా నిర్మించిన పొన్‌మగళ్‌ వందాళ్‌ చిత్రం ఈ నెల 29న ఓటీటీలో విడుదల కానుంది. ఆ మద్య సూర్యపై తమిళ చిత్రపరిశ్రమలో పెద్ద ఎత్తు గొడవ జరిగింది.. ఆయన చిత్రాలు బ్లాక్ చేయాలని గొడవ పెట్టారు.  

 

ఇక సూర్య తమ్ముడు కార్తి కూడా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు లో కార్తి చిత్రాలకు మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆయన భార్య జ్యోతిక కూడా రీ ఎంట్రీ ఇచ్చిన నటిస్తుంది.  ఈ మద్య సూర్య నటించిన చిత్రాలకు కాస్త క్రేజ్ తగ్గుతున్న నేపథ్యంలో ‘సూరారై పొట్రు’ పై ఆశలు పెట్టుకున్నారట సూర్య.  ఆయన త్వరగా కోలుకోవాలని సినీ ఇండస్ట్రీ కూడా కోరుకుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: