ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో... షూటింగ్ లో, థియేటర్లలో సినిమాలు ఏమీ లేకపోవడంతో ప్రేక్షకులు అందరూ కూడా వెబ్ సిరీస్ పై మొగ్గు చూపుతున్నారు.  అంతేకాకుండా బడా నిర్మాతలు అయిన వారు కూడా వెబ్ సిరీస్ లలో నిర్మించడానికి ముందుకు వచ్చిన పరిస్థితులు కూడా మనం చూశాం. ప్రస్తుత రోజులలో చాలా అభివృద్ధి చెందిన డిజిటల్ రంగంలో సరికొత్త సినిమాలను చూసే తరుణంలో వాటిని ఎదుర్కొనే వెబ్ సిరీస్ లు కూడా వస్తున్నాయి అంటే నమ్మండి. 


ఇకపోతే తెలుగు తెరమీద మిస్ అయ్యే ప్రతి కంటెంట్ కూడా ప్రేక్షకులకు వెబ్ సిరీస్ లలో దొరుకుతుంది అంటే నమ్మండి. దీనితో సినిమాలకంటే వెబ్ సిరీస్ లపై ప్రేక్షకులు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే మన మేకర్స్ ప్రపంచ దేశాలతో పాటు మన దగ్గర కూడా అదిరిపోయే వెబ్ సిరీస్ లు నిర్మించడం జరిగింది. ఈ తరుణంలోనే ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఇటీవల నిర్మించిన వెబ్ సిరీస్ పాతాళ్ లోక్. తాజాగా ఇది అమెజాన్ ప్రైమ్ లో రావడం కూడా జరిగింది. ఇది ఇలా ఉండగా ఈ వెబ్ సిరీస్ వీక్షించిన ప్రేక్షకులు అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఈ వెబ్ సిరీస్ లో కొన్ని సన్నివేశాలు హిందూ మతానికి వ్యతిరేకంగా ఉన్నాయి అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా బీప్ ను కూడా  తినే సన్నివేశాలు అంటే అసభ్యకరమైన సన్నివేశాలు కూడా ఉన్నాయి అంటూ ప్రేక్షకులు మండిపడుతున్నారు. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్ ను బ్యాన్ చేయాలి అంటూ సోషల్ మీడియా వేదికగా చేసుకొని నెటిజన్ తీవ్ర ఆగ్రహంతో చెలరేగిపోతున్నారు. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్ లో నిర్మించిన స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ కూడా వివరణ ఇవ్వాలి అంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: