సరిలేరు నీకెవ్వరు తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు తన 27వ చిత్రాన్ని గీత గోవిందం ఫేమ్ పరుశురాం తో చేయనున్నాడు. ఈనెల 31న కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా లాంచ్ కానుందని సమాచారం. ఇక ఈసినిమా కు ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ ను పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ టైటిల్ ఏంటంటే... సర్కారి వారి పాట. మరి సినిమా లాంచింగ్ నాడు టైటిల్ ను కూడా ప్రకటిస్తారో లేదో చూడాలి.
పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ కెమెరామెన్ కాగా థమన్ సంగీతం అందించనున్నాడు అయితే హీరోయిన్ ఎవరనే విషయంలో క్లారిటీ రావాల్సివుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుండగా వచ్చే ఏడాది సంక్రాంతికి ఈసినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశాలు వున్నాయి. నిజానికి
మహేష్, సరిలేరు తరువాత
వంశీ పైడిపల్లి తో
సినిమా చేయాల్సివుంది అయితే
వంశీ చెప్పిన కథ
మహేష్ కు నచ్చకపోవడం తో ఆసినిమాను పక్కకు పెట్టాడు దాంతో పరుశరాం లైన్లోకి వచ్చాడు. ఎప్పటినుండో
మహేష్ కోసం వెయిట్ చేస్తున్న పరుశురాంకు లక్కీగా ఛాన్స్ దొరకవడం తో
సినిమా ఓకే చేయించుకున్నాడు.
ఇక ఈసినిమా తరువాత మహేష్, టాప్ డైరెక్టర్ రాజమౌళితో సినిమా చేయనున్నాడు. భారీ బడ్జెట్ తో దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఈ సినిమా ను నిర్మించనున్నాడు. వచ్చే ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుండగా 2022లో విడుదలకానుంది. ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో బిజీ గా వున్నాడు. బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా నటిస్తుండగా 400కోట్ల బడ్జెట్ తో దానయ్య డివివి నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈసినిమా ప్రేక్షకులముందుకు రానుంది.