సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు తర్వాత చేస్తున్న సినిమా పరశురామ్ డైరక్షన్ లో సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది. మే 31న ఈ సినిమా ముహూర్తం పెట్టుకుంటారని తెలుస్తుంది. మెచ్యూర్డ్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాకు టైటిల్ గా సర్కార్ వారి పాట అని పెట్టబోతున్నారట. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

 

సర్కార్ వారి పాట టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో సినిమా కూడా మరో పరశురామ్ మరో సూపర్ హిట్ కొట్టడం గ్యారెంటీ అంటున్నారు. యువత సినిమాతో దర్శకుడిగా మారిన పరశురామ్ గీతా గోవిందం సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఆ రేంజ్ హిట్ అందుకున్న తర్వాత కూడా రెండేళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. మహేష్ ను మెప్పించిన కథతో వచ్చిన పరశురామ్ టైటిల్ తో కూడా సినిమాపై ఆసక్తి కలిగేలా చేశాడు. సర్కార్ వారి పాట టైటిల్ సౌండింగ్ చాల బాగుంది. కథ, కథనాలే కాదు పరశురామ్ పెన్నుకి పదును ఎక్కువే అందుకే పరశురామ్, మహేష్ సినిమా అనగానే ఇందులో డైలాగ్స్ కూడా అదిరిపోతాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 

 

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్, కియరా అద్వానీల పేర్లు వినపడుతున్నాయి. సర్కార్ వారి పాట అనుకున్న టైం కు అయితే మళ్ళీ వచ్చే సంక్రాంతికి సందడి చేయడం గ్యారెంటీ అని అంటున్నారు. ఈ సంక్రాంతికి సరిలేరు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మహేష్ సర్కార్ వారి పాటతో కూడా మరో హిట్ తన  చూస్తున్నాడు. ఈ సినిమా తరవాత మహేష్ రాజమౌళి డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలుస్తుంది. 2021 మిడిల్ లో మహేష్ జక్కన్న మూవీ స్టార్ట్ అవుతుంది.            

మరింత సమాచారం తెలుసుకోండి: