నిత్యా మీనన్... అతి తక్కువ కాలంలో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్. ఆమె సినిమాలు అనగానే ప్రేక్షకులకు ఒక క్రేజ్ ఉంటుంది. ఆమె సినిమాలు అనగానే  కొన్ని వర్గాల ప్రేక్షకులకు.. ఆసక్తి ఉంటుంది. ఏ సినిమా పడితే ఆ సినిమా ఆమె చేసే అవకాశం ఉండదు. చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తూ ఉంటుంది అనే పేరు ఉంది. ఇక ఆమె చేసిన సినిమాలు మన తెలుగులో పెద్దగా లేకపోయినా ఆమెకు మాత్రం మంచి క్రేజ్ అనేది టాలీవుడ్ లో అయితే వచ్చింది అనేది వాస్తవం. ఆమె సినిమాలు అన్నీ కూడా మన తెలుగులో దాదాపుగా విజయం సాధించాయి. 

 

అందుకే ఆమె చాలా జాగ్రత్తగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. ఇక ఇది పక్కన పెడితే ఆమె ఇప్పుడు తెలుగులో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు అని సమాచారం. ఆమె బాలీవుడ్ లోనే సినిమాలను చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆమె వచ్చే ఏడాది మొత్తం బాలీవుడ్ లో చాలా బిజీ గా ఉంటుంది. అక్కడే ఆమె సినిమాలు అన్నీ కూడా చేసుకుంటుంది. ఇక్కడ సినిమాలలో ఆమెకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని అందుకే ఆమె బాలీవుడ్ లో సినిమాలు చేసుకుంటే మంచిది అనే భావన లో ఉందని టాలీవుడ్ లో టాక్. 

 

ఆమె ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  ఆమె ఇప్పుడు బాలీవుడ్ లో చేస్తున్న సినిమాలు అన్నీ కూడా.. స్టార్ హీరోల సినిమాలే. అందుకే ఇప్పుడు ఆమె అక్కడి సినిమాలను చెయ్యాలి అని చూస్తుంది.  ఆమె మన తెలుగులో సినిమాలు చేస్తే మాత్రం అగ్ర హీరోల సినిమాల్లో చేసే అవకాశం లేదని చిన్న హీరో ల సినిమాల్లో మాత్రమే ఆమె చేసే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: