ప్రస్తుతం మన తెలుగులో కొందరు హీరోలు బాలీవుడ్ కి వెళ్ళాలి అని ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు ఎక్కువగా ఇటీవల కాలంలో వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడి మార్కెట్ ని పెంచుకోవడానికి గానూ మన వాళ్ళు చాలా వరకు కష్టాలు పడుతున్నారు. అక్కడ మార్కెట్ ఒక్కసారి క్లిక్ అయింది అంటే చాలు ఇక తిరుగు ఉండదు అనేది మన వాళ్ళ భావన. అందుకే ఇప్పుడు అక్కడ ఏ విధంగా అయినా సినిమాలను చేసే ప్రయత్నాలను చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అగ్ర హీరోలు అక్కడి మార్కెట్ మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. 

 

ఇక ఇప్పుడు వారు వెనక్కు తగ్గినట్టు సమాచారం. మహేష్ బాబు తారక్ ప్రభాస్ బాలీవుడ్ సినిమాలు వద్దు అని నిర్మాతలకు చెప్పెసినట్టు తెలుస్తుంది. అక్కడి సినిమాలను వద్దు అని చెప్పారట. ఇటీవల బన్సాలి సినిమా ద్వారా బాలీవుడ్ లో అడుగు పెట్టడానికి గానూ తారక్ ప్రయత్నాలు చేస్తున్నాడు అనే వార్తలు వచ్చాయి. కాని ఇప్పుడు లాక్ డౌన్ లో నిర్మాతలు భారీగా నష్టాల్లో ఉన్నారు అని అందుకే అక్కడి సినిమాలను ఇక వద్దు అనుకున్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని అతను చెప్పెసినట్టు వార్తలు వస్తున్నాయి. 

 

ప్రస్తుతం తెలుగు మీద మాత్రమే తాను ఫోకస్ చెయ్యాలి అనుకుంటున్నా అని కాబట్టి ఇప్పుడు అక్కడ ఏ సినిమా కూడా వద్దు అని చెప్పెసినట్టు వార్తలు వస్తున్నాయి. దీని మీద ఇప్పటికే కసరత్తులు కూడా ఆపెసినట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. కుదిరితే వచ్చే ఏడాది చూద్దాం గాని ఇప్పుడు మాత్రం ఏదీ వద్దు అని చెప్పినట్టు సమాచారం. తనకు అడ్వాన్స్ కూడా వద్దు అని అక్కడి నిర్మాతకు తారక్ చెప్పినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఎప్పుడు బాలీవుడ్ లో సినిమా చేస్తాడు అనేది చూడాలి. త్వరలో నే స్పష్టత రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: