టాలీవుడ్ లో ఇప్పుడు సినిమాల షూటింగ్ ఆగిపోయిన నేపధ్యంలో టాలీవుడ్ పెద్దలు అందరూ కూడా ఇప్పుడు సినిమాల షూటింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల తెలంగాణా సిఎం కేసీఆర్ ని కలిసిన సినిమా పెద్దలు ఎప్పుడు సినిమాలను విడుదల చెయ్యాలి అనే దాని మీద చర్చలు జరిపారు. ఇక ఈ తరుణంలో కొందరు టాలీవుడ్ అగ్ర హీరోలు సినిమాల విడుదలకు సంబంధించి ఇప్పుడు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలా అయినా సరే సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి గానూ నానా కష్టాలు పడుతున్నారు. 

 

ఇక ఇప్పుడు  మెగా హీరోలకు చిరంజీవి సూచనలు చేసినట్టు సమాచారం. కుదిరితే మీ సినిమాలను ఓటీటీ ఫ్లాట్ ఫాం లో విడుదల చేసేయమని మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన చిన్న హీరోలకు ఆయన సూచనలు చేసినట్టు తెలుస్తుంది. నిర్మాతలు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా వ్యవహరించాలని అవకాశం ఉంటే వేగంగా సినిమాలను విడుదల చేసి తర్వాతి సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాలని ఆయన సూచనలు చేసినట్టు తెలుస్తుంది. టాలీవుడ్ లో ఇప్పుడు ముందు ముందు ఉన్నదీ అంతా కష్ట కాలమే కాబట్టి జాగ్రత్త పదాలని ఆయన సూచనలు చేసినట్టు తెలుస్తుంది. 

 

అనవసరంగా ఇబ్బంది పడి నిర్మాతలను కూడా ఇబ్బంది పెట్టవద్దు అని కాబట్టి ఇప్పుడే సినిమాలకు విడుదల మార్గం సుగుమం చేసుకుంటే మంచిది అని ఆయన వారికి చెప్పారట. దీనితో హీరోలు అందరూ కూడా ఇప్పుడు సినిమాలను విడుదల చేయడానికి సిద్దమైనట్టు తెలుస్తుంది. వైష్ణవ తేజ్ హీరోగా వస్తున్న ఉప్పెన సినిమాను ఓటీటీ ఫ్లాట్ ఫాం లో విడుదల చేయడానికి సిద్దమయ్యారు అని సమాచారం. త్వరలోనే ఈ సినిమా అక్కడ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అదే విధంగా మరో హీరో సినిమా కూడా విడుదలకు సిద్దమైనట్టు వార్తలు వస్తున్నాయి ఇప్పుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: