ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా పాయల్ రాజపుత్ కి వచ్చిన గుర్తింపు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆ సినిమాలో ఆమె నటన ఆమె అందాలను చూసిన టాలీవుడ్ జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఆమె నటనకు విమర్శకులు కూడా ఫిదా అయ్యారు. ఆ సినిమాలో ఆమె మినహా మరొకరు సరిపోయే అవకాశం లేదు అనే విధంగా ఆమె నటన ఆకట్టుకుంది జనాలను. టాలీవుడ్ లో ఆ సినిమా తర్వాత ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. వరుసగా ఆఫర్లు వచ్చినా సరే ఆమె మాత్రం చాలా జాగ్రత్తగా సినిమాలను చేసి౦ది. 

 

ప్రస్తుతం ఆమె టాలీవుడ్ లో రెండు సినిమాలను చేస్తుంది. అయితే ఆమె ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో ఐటెం సాంగ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. పరుశురాం దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఆమె ఐటెం సాంగ్ చేసే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆ సినిమాలో ఐటెం సాంగ్ ని దేవి శ్రీ ప్రసాద్ పాడే అవకాశ౦ ఉందని టాలీవుడ్ టాక్. ఆ పాటలో ఆమె కనపడే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ జనాలు అంటున్నారు. మరి చేస్తుందా లేదా అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఆ పాట కోసం ఆమె డిమాండ్ చేసే అవకాశం కూడా ఉంది. 

 

ఇప్పుడు టాలీవుడ్ లో పెద్దగా ఐటెం సాంగ్స్ చేయడానికి హీరోయిన్ లు ముందుకు రావడం లేదు. అందుకే ఆమె ఆ అవకాశాన్ని వాడుకోవాలి అని ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇక ఇదిలా ఉంటే ఆమె ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తుంది. ఈ సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ సినిమాల్లో ఆమె నటన మరో రేంజ్ లో ఉంటుంది అని ప్రేక్షకులు అంటున్నారు. మరి చేస్తుందా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: