తెలుగులో ఎంతో మంది బాలీవుడ్ బ్యూటీలో పరిచయం అయ్యారు.. కొద్ది మంది మాత్రమే తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అలాంటి హీరోయిన్స్ లో రాశీఖన్నా ఒకరు. మనంలో నటించినప్పటికీ అంతగా క్రేజ్ రాలేదు. ఆ తర్వాత నటించిన ఊహలుగుసగులాడే మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు ఈ అమ్మడు బొద్దుగా ముద్దగా ఉండేది. రాశీ మెగ్జెన్ కోసం చాలా బరువు తగ్గింది. ఫోటోలో ఆమె బరువు తగ్గినట్లు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. . తెలుగులో జిల్, సుప్రీం, హైపర్, జై లవకుశ, ఆక్సిజన్, టచ్ చేసి చూడా, తొలి ప్రేమ మూవీల్లో నటించింది. కానీ తమిళంలో మాత్రం కేవలం రెండు చిత్రాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం అమ్మడి చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో రాశీఖన్నా తమిళంలో పాగా వేసింది. తాజాగా సూర్య తో యాక్షన్ సినిమా దర్శకుడు హరి తెరకెక్కించనున్న మూవీ అంగీకరించింది. లాక్డౌన్ కావడంతో ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడింది. త్వరలో లాక్డౌన్ ముగియనుండటంతో అంతా షూటింగ్ ఏర్పాట్లులో నిమగ్నమవుతున్నారు. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ సోయగం తెలుగు నేర్చుకుని కొన్ని సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. అంతే కాదు రాశీఖన్నా ఎంతో మధురంగా పాడగలదు.. అప్పుడప్పుడు ఈ అమ్మడు తన పాటలు తానే పాడుకుంటుంది.
ఈ నేపథ్యంలోనే తమిళంలోనూ సూర్య సినిమాకి తానే డబ్బింగ్ చెప్పాలని ఫిక్సయిందట. ఇందులో భాగంగా తమిళ భాషపై పట్టు సాధించడం కోసం కుస్తీ పడుతోంది. ఈ సందర్భంగా రాశి పెట్టిన పోస్ట్ ఆకట్టు కుంటోంది. `మళ్లీ స్కూల్కి వచ్చినట్టుగా వుంది. తమిళ భాష నేర్చుకుంటున్నాను. ఇందుకు ఓ టీచర్ని కూడా అపాయింట్ చేసుకున్నాను. ఆమె పేరు లీలా. ప్రస్తుతం క్లాస్ వర్క్ , హోమ్ వర్క్, క్లాస్ టెస్ట్లతో బిజీగా వున్నాను` అని ట్వీట్ చేసింది.
View this post on InstagramBack to school! Have been brushing up my tamil speaking skills with an amazing teacher, Ms. Leela. Now I have class work and home work and class tests!! What constructive things have you been doing in this lockdown?