టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో నటించినా నటించకపోయినా ఏమాత్రం చరిష్మా తగ్గని నటుడు పవన్ కళ్యాణ్. పవన్ సినిమాకు హిట్ టాక్ వచ్చినా ఫ్లాప్ టాక్ వచ్చినా కలెక్షన్స్ లో కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి. కాగా రాజకీయాల్లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్ పూర్తి జీవితం ప్రజల కోసమే సినిమాలలో నటించను అంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఈ క్రమంలోనే హిందీ హిట్ సినిమా 'పింక్' రీమేక్ 'వకీల్ సాబ్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి 'ఓ మై ఫ్రెండ్' 'ఎంసీఏ' ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు మరియు బోనీకపూర్ కలిసి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కరోనా లాక్‌ డౌన్ నేపథ్యంలో షూటింగ్ తాత్కాలింగా వాయిదా వేసారు.

 

వకీల్ సాబ్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమాని ఏఎం రత్నం నిర్మించనున్నారు. ఆ తర్వాత తన కెరీర్లో 28వ చిత్రంగా తెరకెక్కనున్న చిత్రాన్ని హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ వారు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. వీటితో పాటు డైరెక్టర్ డాలీ (కిషోర్ కుమార్ పార్థసాని) పవన్‌ కాంబో రిపీట్ చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. వీరిద్దరి కలయికలో ఇంతకముందు ‘గోపాలా గోపాల’, ‘కాటమరాయుడు’ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు పవన్ కళ్యాణ్‌కి డాలీ కథ చెప్పడం అయ్యిందని.. హరీష్ శంకర్ సినిమా కంటే కూడా ముందు ఈ సినిమానే వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. దీంతో డాలీ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా రాబోతోందని అందరూ అనుకున్నారు.

 

అయితే తాజా సమాచారం ప్రకారం డాలీతో పవన్ మూవీ ఒట్టి పుకార్లే అని తెలుస్తోంది. అసలు డాలీ పవన్ కళ్యాణ్‌ని కలుసుకోలేదట. వీరి కాంబినేషన్ కూడా సెట్ అయ్యే అవకాశం లేదని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ 'వకీల్ షాబ్' సినిమా ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందట. షూటింగులు స్టార్ట్ అయిన వెంటనే మిగతా భాగాన్ని చిత్రీకరించి వీలైనంత త్వరగా సినిమా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: