సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సినిమా వ‌స్తుందంటే చాలు టాలీవుడ్ లో ప్రేక్ష‌కుల అంచ‌నాలు ఎలా ?  ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మహేష్ బాబు సినిమా ఎలా ఉన్నా సరే ప్రేక్షకులు చూస్తారు. అవును ఇది నిజమే... టీవీ లో వచ్చినా సరే సినిమాలను వదలకుండా చూస్తూ ఉంటారు. మ‌హేష్ బాబు అత‌డు, ఖ‌లేజా సినిమాలు వెండి తెర మీద ప్లాప్ అయినా బుల్లి తెర మీద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేశాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అంత క్రేజ్ ఉన్న మహేష్ బాబు ఇప్పుడు క‌థ‌ల ఎంపిక‌లో బాగా ఇబ్బంది పడుతున్నాడ‌ట‌. అతను సినిమాలు ఫ్లాప్ అవ్వకుండా వసూళ్లు కూడా భారీగా వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.



అయితే ఈ క్రమంలోనే అతను కొన్ని సెంటిమెంట్ లు ఫాలో అవుతున్నాడు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అది ఏంటీ అనేది చూస్తే... అతనికి ఎస్ బాగా కలిసి వచ్చింది అని అంటున్నారు. ఎస్ అనే టైటిల్ వచ్చిన ప్రతీ సినిమా కూడా అతనికి మంచి హిట్ ఇచ్చింది. ఆ టైటిల్ తో మూడు నాలుగు సినిమాలు వచ్చాయి. ఆ మూడు నాలుగు సినిమాలు కూడా అతని కెరీర్ కి ప్లస్ అయ్యాయి అని అంటుంది టాలీవుడ్. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు మ‌నోడు ఈ సెంటిమెంట్ ఫాలో అయ్యేందుకు ఆస‌క్తితో ఉన్నాడ‌ని అంటున్నారు.



మ‌హేష్ బాబు చేసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా మంచి హిట్ అయింది. ఆ తర్వాత వరుస ఫ్లాపుల తర్వాత శ్రీమంతుడు సినిమా చేయగా ఆ సినిమా మంచి హిట్ సాధించింది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా మ‌హేష్ బాబు కెరీర్‌కు ఓ ట‌ర్నింగ్ పాయింట్‌. ఆ తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమా చేసాడు ఎస్ టైటిల్ తో. ఈ సినిమా కూడా అతనికి మంచి హిట్ ఇచ్చింది. స్పైడర్ సినిమా ఒక్క‌టి మాత్రం కాస్త అంచ‌నాలు అందుకోలేక పోయింది. ఇక ఇప్పుడు సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: