అల్లు అర్జున్ 2020 సంక్రాంతికి అల వైకుంఠపురంలో సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని అత్యధిక వసూళ్లు సాధించి టాప్ సినిమాగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. కన్నడ బ్యూటి రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ నే కాదు ప్రేక్షకులందరిని విపరీతంగా ఆకట్టుకుంది.

 

శేషాచలం అడవుల్లో స్మగ్లింగ్ బ్యాగ్డ్రాప్ లో ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. మైత్రీ మూవీమేకర్స్ పాన్ ఇండియా సినిమాగా అయిదు భాషల్లో నిర్మిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ తెలుగుతో పాటు మిగతా భాషల్లో ను డబ్బింగ్ చెప్పుకోవాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమాని 2021 లో రిలీజ్ చేయనున్నారు. పవన్ కళ్యాణ్ .. మహేష్.. ఎన్టీఆర్.. రామ్ చరణ్.. చిరంజీవి.. ప్రభాస్ వంటి స్టార్ అందరు బాక్సాఫీస్ వద్ద 2021 లో పోటీ పడబోతున్నారు. వీళ్ళతో పాటు పోటీకి బన్నీ కూడా రెడీ అవుతున్నాడని తెలుస్తుంది.

 

ఇక ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో ముందు నుంచి రక రకాల వార్తలు వస్తున్నాయి. రష్మిక మందన్న తో పాటు మరో హీరోయిన్ కూడా ఉంటుందని.. ఆ హీరోయిన్ పూజా హెహ్డే అని...అలాగే కియారా అద్వాని అని...కీర్తి సురేష్ అని ...నివేదా థామస్ అని ...వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో దేవీశ్రీప్రసాద్ మార్క్ ఐటం సాంగ్ ఉంటుందని అందులో బాలీవుడ్ బ్యూటీస్ దిశాపఠాని నర్తించబోతుందని వార్తలు వచ్చాయి.

 

అంతేకాదు మరో రెండు పేర్లు ఈ ఐటం సాంగ్ కోసం తెరమీదకి వచ్చాయి. వాళ్ళలో ఒకరు జాక్విలిన్ ఫెర్నాండస్ కాగా మరొకరు ఊర్వశి రౌతెలా ..మరి వీళ్ళలో ఐటం సాంగ్ కి ఎవరిని ఫైనల్ చేస్తారో తెలీదు.. అలాగే హీరోయిన్స్ కూడా  ఇద్దరని సమాచారం. మరి ఆ రెండవ హీరోయిన్ ఎవరన్నదే ఇప్పుడు ఫ్యాన్స్ లో ఆసక్తికరంగా మారింది. అయితే ఎక్కువగా వినిపిస్తుంది మాత్రం నివేదా థామస్ పేరే ..!

మరింత సమాచారం తెలుసుకోండి: