టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమా అంటే గుర్తుకొస్తున్న పేరు విక్టరీ వెంకటేష్. సీనియర్ హీరో గా ముద్ర పడిపోవడంతో ప్రస్తుతం తర్వాత తరం పవన్ కళ్యాణ్ మహేష్ లాంటి హీరోల టైం నడుస్తున్న తరుణంలో వెంకీ చాలా తెలివిగా తన కెరియర్ మలుచుకుంటున్నారు. గతంలో మల్టీస్టారర్ సినిమాలు అంటే ఏ హీరో కూడా ముందుకు వచ్చేవారు కాదు. బడ్జెట్ సరిపోవు, ఇమేజ్ లు అదేవిధంగా ఈగో ఇటువంటి వాటి తో హీరోలు ధైర్యం చేసేవారు కాదు. అయితే వాటన్నిటినీ లెక్కచేయకుండా విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్ సినిమాలకు నాంది పలికారు. మొదటిగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా చేయడం జరిగింది. సినిమాకి మంచి రెస్పాన్స్ ప్రేక్షకులనుండి రావడంతోపాటు సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

 

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో డాలీ దర్శకత్వంలో 'గోపాల గోపాల' సినిమా చేయడం జరిగింది. దీంతో విక్టరీ వెంకటేష్ సారధ్యంలో మల్టీస్టారర్ సినిమాలు విరివిగా రావడం మొదలుపెట్టాయి. మసాలా, వెంకీ మామా, ఎఫ్ 2… ఇలా వరుసగా మల్టీస్టారర్ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్ చేతిలో మూడు మల్టీస్టార‌ర్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఎఫ్ 2కి సీక్వెల్‌గా ఎఫ్ 3 క‌థ‌ని సిద్ధం చేశాడు అనిల్ రావిపూడి. మ‌రోసారి వెంకీ, వ‌రుణ్‌లు కోబ్రా సెంటిమెంట్ కొన‌సాగించ‌బోతున్నారు.

 

ఇదిలా ఉండగా మరో రెండు క్రేజీ మల్టీస్టారర్ సినిమాలో వెంకటేష్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో వరుసగా మల్టీస్టారర్ సినిమాలు చేయడంతో వెంకటేష్ సపరేట్ అభిమానులు సోలోగా హిట్ కొట్టమని మొత్తుకుంటున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆల్రెడీ రెండు సినిమాలు చేశారు. హ్యాట్రిక్ గా మూడో సినిమాని సోలోగా ప్లాన్ చేయాలని వెంకీకి అభిమానులు సూచనలు ఇస్తున్నారు. సోలో గా చూసి చాలా కాలమైంది కాబట్టి సోలో సినిమా ఒకటి చేయాలని వెంకటేష్ ని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: