సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో మైలురాయి సిల్వర్ జూబ్లీ మూవీగా వచ్చిన చిత్రం 'మహర్షి'. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మహేష్ అభిమానులు 25 వ సినిమా ఎలా ఉండాలని భావించారో ఆ అంచనాలకు తగ్గట్టుగానే దర్శకుడు వంశీ పైడిపల్లి మంచి సినిమా అందించారు. దీంతో వంశీ పైడిపల్లి నెక్స్ట్ సినిమా మళ్ళీ మహేష్ తోనే.. అది కూడా గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో సినిమా అని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ ఏడాది ప్రారంభంలో 'సరిలేరు నీకెవ్వరు'తో మంచి విజయం అందుకున్న మహేష్ బాబు ఆ తర్వాత డైరెక్టర్ వంశీ పైడిపల్లితో సినిమా పట్టాలెక్కించాలనుకున్నాడు. కానీ వంశీ పైడిపల్లి రెడీ చేసిన స్క్రిప్ట్ విషయంలో మహేష్ బాబు సంతృప్తిగా లేకపోవడంతో ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఈ నేపథ్యంలో మహేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం 'గీతగోవిందం' డైరెక్టర్ పరశురామ్ ని లైన్లో పెట్టాడు. ఈ సినిమాకి 'సర్కార్ వారి పాట' అనే టైటిల్ అనుకుంటున్నారని.. మే 31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్బంగా ఆఫీసియల్ గా స్టార్ట్ చేసే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా దర్శకధీరుడు రాజమౌళి కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ బాబుతో ఉంటుందని అనౌన్స్ చేసేసాడు. దీనితో మహేష్ - వంశీ పైడిపల్లి మూవీ ఇప్పట్లో లేనట్టే అని ప్రచారం జరుగుతోంది.

 

అయితే తాజా సమాచారం ప్రకారం వంశీ పైడిపల్లి మహేష్ పై ఇంకా ఆశలు పెట్టుకున్నాడట. అంతేకాకుండా ఎలా అయినా సరే మళ్ళీ మహేష్ బాబుతోనే సినిమా తియ్యాలని ఫిక్స్ అయ్యారట. అందుకే స్క్రిప్ట్ ను మళ్ళీ రీ డిజైన్ చేసి లేటైనా పర్లేదు మహేష్ తోనే సినిమా చెయ్యాలని అనుకుంటున్నారట. అందుకే పూర్తి చేసిన స్క్రిప్ట్ ను మరోసారి మహేష్ ను కలవాలని అనుకుంటున్నారట. మరి ఈసారి వంశీ ట్రయిల్ జర్నీకి కామా పడుతుందో మళ్ళీ ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి. కానీ జక్కన్నతో సినిమా అంటే ఎప్పుడు స్టార్ట్ అవుద్దో ఎప్పుడు కంప్లీట్ అవుద్దో చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో 'మహర్షి' సినిమా మహేష్ బాబుతో తీయడానికి రెండేళ్లు వెయిట్ చేసిన వంశీ పైడిపల్లి.. మరో సినిమా చేయడానికి ఇంకెన్ని ఏళ్ళు టైమ్ తీసుకుంటాడో అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంకొంతమంది మాత్రం ఇంత జరిగినా సూపర్ స్టార్ మీద ఆ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఆశలు మాత్రం చావడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: