మహేష్ బాబు కెరీర్లో ఎన్నో సూపర్ హిట్స్ ఉండొచ్చు. మరెన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చి ఉండవచ్చు. అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమాగా గుర్తుండిపోయిన సినిమా మహర్షి. సోషల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాని తెరకెక్కించిన వంశీ పైడిపల్లికి మంచి గుర్తింపుని తీసుకువచ్చింది. దాంతో మహేష్ బాబు వంశీ దర్శకత్వంలో మరో సినిమా ఒప్పుకున్నాడు.

 

సరిలేరు నీకెవ్వరు తర్వాత వంశీ దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్న మహేష్ సడెన్ గా ప్లాన్ చేంజ్ చేసుకున్నాడు. వంశీ చెప్పిన లైన్ కి ఇంప్రెస్ అయిన మహేష్, పూర్తి స్క్రిప్టు విన్నాక పెదవి విరిచాడని వార్తలు వచ్చాయి. దాంతో మహేష్ మరో దర్శకుడి వేటలో పడ్డాడు. అప్పుడే గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ లైన్లోకి వచ్చాడు. యువత సినిమాతో కెరీర్ ప్రారంభించిన పరశురామ్ గీత గోవిందం సినిమాతో దర్శకుడిగా తన గీత మార్చుకున్నాడు.

 

అయితే మహేష్- పరశురామ్ కాంబినేషన్లో సినిమా గురించి రోజూ వార్తలు వస్తున్నా మహేష్ సైడ్ నుండి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. కానీ పరశురామ్, మహేష్ తో సినిమా ఉంటుందని కన్ఫర్మ్ చేసేశాడు. అయితే వంశీ పైడిపల్లి తన నెక్స్ట్ చిత్రం మహేష్ తోనే తీద్దామని డిసైడ్ అయినట్టున్నాడు. ఇంతకుముందు రాసిన కథని పక్కకి పెట్టి మరో కొత్త కథతో మహేష్ వద్దకి వెళ్తున్నాడని టాక్ వినబడుతోంది.

 

మరి వంశీ చెప్పబోతున్న ఈ కథని మహేష్ ఒప్పుకుంటాడా లేదా చూడాలి. ఒకవేళ ఒప్పుకున్న ఆ సినిమా తెరకెక్కడానికి చాలా టైమ్ పడుతుంది. ఇప్పటికే మహేష్ వరుసగా డైరెక్టర్లని లాక్ చేస్తూ వస్తున్నాడు. పరశురామ్ తో సినిమా అనంతరం రాజమౌళితో పాన్ ఇండియా రేంజ్ మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత మహేష్ రేంజ్ మారిపోయే అవకాశం ఉంది. మరి వంశీకి ఎప్పుడు టైమ్ ఇస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: