సరికేరు నీకెవ్వరూ తర్వాత సూపర్ స్టార్ మహేష్ యువ దర్శకుడు పరశురామ్ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రాబోతున్న ఈ సినిమాకు టైటిల్ గా సర్కార్ వారి పాట అని పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. పొలిటికల్ సెటైర్ గా రాబోతున్న ఈ సినిమాలో మహేష్ సరసన ఎవరు జతకడుతున్నారు అన్నది హాట్ న్యూస్ గా మారింది. ఓ పక్క కీర్తి సురేష్ కు మహేష్ మూవీ ఛాన్స్ అని హడావిడి చేస్తుండగా ఆమె కాదు బాలీవుడ్ భామ మహేష్ ఛాన్స్ అందుకుంది అంటున్నారు. 

 

ఇక లేటెస్ట్ న్యూస్ ప్రకారం బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీనే ఈ సినిమాలో మహేష్ జోడీగా ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ లో వరుస సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ లతో కూడా సత్తా చాటుతుంది కియరా అద్వానీ లేటెస్ట్ గా మరోసారి తెలుగు స్టార్ సినిమా ఆఫర్ అందుకుంది తెలుస్తుంది. మహేష్ నటించిన భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగు ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత వినయ విధేయ రామ సినిమాలో కూడా నటించింది. 

 

ఇక సర్కార్ వారి పాటతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తుంది కియరా. బాలీవుడ్ లో వరుస ఆఫర్లు వస్తున్నా సరే తెలుగులో కూడా స్టార్స్ ఆమెను కోరుతున్నారు. అందుకే రెమ్యునరేషన్ కూడా భారీగానే వసూలు చేస్తుందని తెలుస్తుంది. తెలుగు, హిందిలో దుమ్ముదులిపేస్తున్న కియరా తమిళంలో కూడా సినిమాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా హీరోయిన్స్ అందరు కొద్దిగా వెనుక పడగా ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న కియారా చేతినిండా ఆఫర్స్ తో అదరగొట్టేస్తుంది. సర్కార్ వారి పాట హిట్టయితే తెలుగులో కియరా క్రేజ్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు ఇక్కడ కూడా అదిరిపోయే ఆఫర్స్ వస్తాయి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: