మహేష్ బాబు హీరోగా పరుశురాం దర్శకత్వంలో   ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టడానికి చిత్ర యూనిట్ సిద్దమవుతుంది. ఎప్పుడు సినిమా షూటింగ్ ని మొదలు పెడతారు అనేది తెలియాల్సి ఉంది. సినిమాలో ఇప్పుడు కొన్ని సన్నివేశాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. మహేష్ బాబు కొన్ని కొన్ని సన్నివేశాలు వద్దు అని చెప్పాడు అని వాటిని మార్చే ప్రయత్నం దర్శకుడు చేస్తున్నాడు అని సమాచారం. ప్రస్తుతం సినిమా కథను మహేష్ బాబు కూడా వింటున్నాడు అని పూర్తిగా మార్పులు చేయిస్తున్నాడు అని సమాచారం. 

 

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా విలన్ గా ఎవరు ఉంటారు అనేది ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతుంది. హీరోయిన్ గా మహేష్ బాబు తో సినిమా చేసిన కైరా అద్వానీని ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని అయితే ఆమెను సినిమాలోకి తీసుకోవడానికి మహేష్ బాబు స్వయంగా అడిగాడు అని సమాచారం దీని తోనే కైరా సినిమా కి ఓకే చెప్పింది అని తెలుస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడు. 

 

సినిమా వచ్చే ఏడాది చివరి నుంచి షూటింగ్ కి వెళ్తుంది. ఆమెను మహేష్ బాబు లక్కీ హీరోయిన్ అనుకున్నాడు అని అందుకే ఆమెను తీసుకోవడానికి ఆసక్తి చూపించాడు అని సమాచారం. మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో మహేష్ బాబు కుమారుడు గౌతం కూడా ఉండే అవకాశం ఉందని చిన్న నాటి మహేష్ బాబు గా అతను నటిస్తాడు అని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: