అగ్ర హీరోల సినిమాలు అనగానే ఇప్పుడు మన తెలుగులో జనాలకు ఒకరకంగా పిచ్చి ఎక్కే విధంగా ఉంటుంది. వారి సినిమా వస్తుంది అంటే చాలు ఎక్కడా లేని ఆనందం ఉంటుంది. ఇక ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా వారి సినిమాలు ఏ ఒక్కటి కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక ఇప్పుడు సినిమాలకు అనుమతులు ఇచ్చినా సరే సినిమాలను విడుదల చేసే అవకాశం లేదని సమాచారం. అగ్ర హీరో సినిమా అనగానే ఎక్కువ మంచి హాల్ కి వస్తు ఉంటారు. దీని కారణంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే సినిమాల షూటింగ్ లను అనుమతి ఇచ్చినా సినిమాల విడుదలకు మాత్రం అనుమతి ఇవ్వడం లేదు. 

 

ఇక సినిమాలు విడుదల చేసినా సరే జనాలు హాల్ కి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. చాలా మంది హాల్ కి వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు అని టాలీవుడ్ లోనే అంటున్నారు. అందుకే ఇప్పుడు చాలా జాగ్రత్తగా సినిమాల విషయంలో నిర్ణయాలు తీసుకోవడం మంచిది అని అంటున్నారు. అగ్ర హీరోల సినిమాలను విడుదల చేసే సమయంలో ఒకటికి వంద సార్లు ఆలోచన చేసి ఓకే చెయ్యాలని ప్రభుత్వం కూడా ఇబ్బందికరంగా నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పినట్టు తెలుస్తుంది. 

 

ఇక  మరో విషయం ఏంటీ అంటే చిన్న చిన్న హీరోల సినిమాలను విడుదల చేసినా సరే రోజు విడిచి రోజు ప్రదర్శించే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి వీటి విషయంలో ఏ నిర్ణయం సినీ పెద్దలు తీసుకుంటారు అనేది చూడాలి. కాగా ఇప్పుడు చిరంజీవి రామ్ చరణ్ ఎన్టీఆర్ సహా కొందరు హీరోల సినిమాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. లాక్ డౌన్ కారణంగా వాటి కీలక సన్నివేశాల షూటింగ్ దాదాపుగా ఆగిపొయి౦ది. మరి ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: