టాలీవుడ్ లో ఇప్పుడు సినిమాల షూటింగ్ కి అంగీకరించే అవకాశం ఉందని సమాచారం. ఇక అదే విధంగా విడుదలకు కూడా అనుమతులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఇక్కడ కొన్ని జాగ్రత్తలను ఇప్పుడు ప్రభుత్వాలు సూచించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన మార్గ దర్శకాలను విడుదల చేసే సూచనలు ఉన్నాయని అంటున్నారు. సినిమాలు విడుదల చేయకపోతే అటు ప్రభుత్వానికి కూడా నష్టం వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటికి అనుమతులు ఇవ్వడం అనేది ఇప్పుడు చాలా అవసరం. 

 

ఇక ఇది పక్కన పెడితే సినిమాలను విడుదల చేస్తే మార్గ దర్శకాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనేది చూస్తే... ఇక నుంచి సినిమా హాల్స్ లో కేవలం మూడు షోస్ కి మాత్రమే అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం అదే విధంగా సినిమా హాల్ లో శానిటేషన్ తో పాటుగా ఆహార పదార్ధాలను కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే విధంగా సినిమా హాల్ కి వచ్చే వారికి మాస్క్ తో పాటుగా 40 శాతం సీటింగ్ ని తగ్గించే అవకాశం ఉందని తెలుస్తుంది. అదే విధంగా మూడు షోస్ అయినా కూడా చాలా తక్కువ మంది తో అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. 

 

ఇక సినిమాలను రెండు రోజుల గ్యాప్ లో  ప్రదర్శించే విధంగా అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అగ్ర హీరోల సినిమాలకు మూడు రోజుల పాటు గ్యాప్ తీసుకునే అవకాశం ఉందని కూడా టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. ఇక విదేశీ నటులను సినిమాల్లో వద్దు అని టాలీవుడ్ పెద్దలు కూడా భావిస్తున్నారు. అనవసరంగా ఇబ్బందులు వద్దు అనే ఆలోచనలో వారు ఉన్నారని తెలుస్తుంది. మరి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: