మహేష్ బాబు సినిమాల కోసం ఇప్పుడు ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురు చూస్తారో అందరికి తెలిసిందే. అతని సినిమాల కోసం అటు దర్శకులు కూడా ఒక రేంజ్ లో ఎదురు చూస్తారు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే మహేష్ బాబు తో సినిమా చేస్తే మంచి పేరు వస్తుంది అనే భావన దర్శక నిర్మాతలకు ఉంటుంది. దర్శక నిర్మాతలు అందుకే ఆయన తో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ప్రస్తుతం మహేష్ బాబు కేవలం ఒక సినిమానే చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన రాజమౌళి తో ఒక సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. 

 

ఆయన కూడా దీనిపై ఇటీవల ఒక మీడియా తో మాట్లాడుతూ చెప్పారు. ఇక మహేష్ బాబు ఇప్పుడు ఒక మల్టీ స్టారర్ సినిమాలో నటించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నిజమో కాదో తెలియదు గాని మహేష్ బాబు ఒక భారీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్ ఏంటీ అనేది తెలియదు గాని దర్శకుడు మాత్రం అనీల్ రావిపూడి అని ఎఫ్ 3 తర్వాత ఈ సినిమా చేసే అవకాశం ఉందని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అనీల్ రావి పూడి ఇప్పటికే దీనికి సంబంధించిన కథ ను కూడా మహేష్ బాబు కి చెప్పాడని అంటున్నారు. 

 

ఇప్పుడు లాక్ డౌన్ ఉంది కాబట్టి మహేష్ బాబు ఆ సినిమా కథను అనీల్ తో రెడీ కూడా చేయించాడు అని సమాచారం. అన్ని అనుకున్నట్టు జరిగితే మరో రెండేళ్లలో ఈ సినిమా విడుదల కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబు పరుశురాం దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: