సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి జోరుమీద ఉన్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో సరిలేరు నీకెవ్వరు సినిమా తో ఇటీవల సంక్రాంతి పండుగకు బాక్సాఫీస్ దగ్గర హ్యాట్రిక్  విజయాన్ని సాధించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఈ ఏడాది ప్రారంభంలో మహేష్ నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో  రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టారు. సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో కుటుంబ సమేతంగా అమెరికా ట్రిప్పు తో ఫుల్ ఎంజాయ్ చేసిన మహేష్ బాబు.. వచ్చిన వెంటనే నెక్స్ట్ సినిమా లైన్ లో పెడదామని రెడీ అయ్యారు. అమెరికా వెళ్లి రావటం జరిగింది నెక్స్ట్ సినిమా వంశీ పైడిపల్లి తో అని అంతా కన్ఫామ్ అయ్యారు. అమెరికానుండి వచ్చిన వెంటనే స్టోరీ విన్న మహేష్ బాబు కథలో మార్పులు చేయాలని వంశీపైడిపల్లి సూచించడంతో చాలా టైం పట్టింది.

IHG'real collections' -

 కానీ వంశీపైడిపల్లి మార్పులు చేసిన స్టోరీ నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్టుని మహేష్ బాబు పక్కన పెట్టడం జరిగింది. దీంతో మహేష్ బాబు నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో చేయబోతున్నారు అన్నది సస్పెన్స్ గా అభిమానుల లోనూ అదే విధంగా ఇండస్ట్రీలో నెలకొంది. ఈ సందర్భంగా 'గీతాగోవిందం' లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తీసిన డైరెక్టర్ పరుశురాం మహేష్ కి కథ చెప్పడంతో ఓకే అవటంతో ఆయనతో సినిమా దాదాపు ఓకే అయినట్లు వార్తలు ప్రస్తుతం వినబడుతున్నాయి.

IHG

అంతేకాకుండా ఈ సినిమాకి “సర్కారీ వారి పాట” అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా మే 31 వ తారీకు సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మహేష్ తెలుపబోతున్నట్లు ఫిలిం నగర్ టాక్. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ఫిక్స్ అయినట్లు అదేవిధంగా హీరోయిన్ క్యారెక్టర్ లో కైరా అద్వానీ ఒకే అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాలన్నీ కృష్ణా పుట్టినరోజునాడు మే 31 నాడు సినిమా యూనిట్ చెప్పబోతున్నట్లు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: