సూపర్ స్టార్ మహేష్ తన నెక్స్ట్ సినిమా పరశురామ్ డైరక్షన్ లో చేస్తాడని కన్ఫర్మ్ అయ్యింది. ఈ సినిమా ముహూర్తం మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు పెట్టుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. గీతా గోవిందం తర్వాత పరశురామ్ చేస్తే స్టార్ హీరోతోనే సినిమా చేయాలని వెయిట్ చేసి మరి మహేష్ ను ఒప్పించే కథే వస్తున్నాడు. ఈ సినిమా పొలిటికల్ సెటైరికల్ మూవీగా వస్తుందని అంటున్నారు. అంతేకాదు సినిమా టైటిల్ కూడా సర్కార్ వారి పాట అని అనుకుంటున్నారట. 

 

టైటిల్ దాదాపు అదే కన్ఫర్మ్ అని తెలుస్తుంది. సరిలేరు నీకెవ్వరు లానే సినిమా ముహూర్తం రోజే టైటిల్ పోస్టర్ రివీల్ చేసి ఫ్యాన్స్ కు సర్ ప్రయిజ్ ఇద్దామని అనుకున్నారు కానీ ఈలోగా టైటిల్ ఇదే అంటూ లీక్ చేశారు. టైటిల్ బయటకు రావడంపై మహేష్ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు తన పిఆర్ టీం ను కూడా హెచ్చరించినట్టు టాక్. సర్కార్ వారి పాట టైటిల్ చాలా కొత్తగా ఉంది. పరశురామ్ ఈసారి మహేష్ తో తన మేజిక్ రిపీట్ చేసేలా ఉన్నాడు. సరిలేరు సక్సెస్ తో మహేష్, గీతా గోవిందం లాంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన పరశురామ్ ఇద్దరు కలిసి ఎలాంటి సినిమా చేస్తారో అని ఆడియెన్స్ లో ఎక్సయిటింగ్ మొదలైంది. 

 

ఇక సినిమాలో మహేష్ సరసన మరోసారి బాలీవుడ్ భామ కియరా అద్వానీ నటిస్తుందని అంటున్నారు. ఆల్రెడీ భరత్ అనే నేను సినిమాలో కియరా అద్వానీ మహేష్ తో నటించింది. మళ్ళీ ఆమె కావాలని మరి మహేష్ పట్టుబట్టాడట. ఇక వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న మహేష్ మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. సర్కార్ వారి పాట కూడా హిట్ అయితే డబుల్ హ్యాట్రిక్ చేసినట్టు అవుతుంది. ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: