‘బాహుబలి’ తో నేషనల్ సెలెబ్రెటీ స్థాయికి ఎదిగిపోయిన ప్రభాస్ కు బాలీవుడ్ లో విపరీతమైన ఇమేజ్ ఉంది. ‘సాహో’ ఘోర పరాజయం చెందినా ప్రభాస్ డేట్స్ ఇస్తే అత్యంత భారీ పారితోషికం ఇస్తాము అంటూ అనేకమంది బాలీవుడ్ దర్శక నిర్మాతలు ప్రభాస్ ముందు క్యూ కడుతున్నారు.


ఇలాంటి రేంజ్ ఉన్న ప్రభాస్ ను యంగ్ హీరో అఖిల్ తో సమానం చేస్తూ పూజ హెగ్డే అనుసరిస్తున్న కొత్త వ్యూహం ప్రభాస్ అభిమానులను ఆశ్చర్య పరుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ గోల్డ్ లెగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పూజ హెగ్డే ప్రభాస్ జిల్ రాథా కృష్ణల మూవీతో పాటుగా అఖిల్ తో కలిసి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ మూవీ ఈ సమ్మర్ రేస్ లో విడుదల కావలసి ఉంది.


చిత్రీకరణ ముగింపు దశకు చేరుకున్న ఈ మూవీలో అఖిల్ పూజ హెగ్డే లపై రెండు పాటలు చిత్రీకరణ చేయవలసి ఉంది. లాక్ డౌన్ సినిమా షూటింగ్ లు అన్నీ ఆగిన నేపధ్యంలో ప్రబాస్ మూవీతో పాటు అఖిల్ మూవీ కూడ ఆగిపోయింది. ఇప్పుడు తెలగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెల నుండి తిరిగి షూటింగ్ లకు అనుమతులు ఇస్తున్న పరిస్థితులలో ఈ రెండు సినిమాలలోను హీరోయిన్ గా నటిస్తున్న పూజ హెగ్డే ను ఈ రెండు సినిమాల దర్శకులు సంప్రదించినప్పుడు వారికి పూజ హెగ్డే నుండి మైండ్ బ్లాంక్ అయ్యే సమాధానం వచ్చినట్లు టాక్.


తనకు సంబంధించినంత వరకు ప్రభాస్ అఖిల్ సినిమాల షూటింగ్ లు రెండు సమానం అనీ ఈ రెండు సినిమాల నిర్మాతలలో ఎవరు ముందు తన డేట్స్ అడుగుతారో వారికి తన డేట్స్ ఇచ్చి ఆతరువాత రెండవ సినిమాకు తన డేట్స్ ఇచ్చే విషయం ఆలోచిస్తాను అంటూ పూజ తన మేనేజర్ ద్వారా ప్రభాస్ అఖిల్సినిమా నిర్మాతలకు సమాధానం ఇచ్చినట్లు టాక్. దీనికి సంబంధించిన ఈ విషయాన్ని ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక చాల ప్రముఖంగా కవర్ చేయడంతో ఈ విషయం ప్రభాస్ అభిమానుల దృష్టి వరకు వెళ్ళి వాళ్ళు అసహనానికి లోనవ్వడమే కాకుండా నేషనల్ సెలెబ్రెటీ స్థాయిలో ఉన్న ప్రభాస్ పట్టుమని నాలుగు సినిమాలలో నటించిన అఖిల్ పూజ హెగ్డే దృష్టిలో ఒక్కటేనా ప్రభాస్ అభిమానులు అసహనానికి లోనవుతున్నట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: