మహేశ్ మరోసారి వెరైటీ టైటిల్ తో వస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో నటించే సినిమా టైటిల్ ను చూస్తుంటే.. భరత్ అనే నేను మాదిరి ఇంకోసారి రాజకీయాల్లోకి వస్తున్నాడనిపిస్తోంది. త్వరలో మొదలయ్యే ఈ సినిమాకు ఎంతో స్పెషల్ ఉంది. 

 

సరిలేరు నీకెవ్వరు తర్వాత ఐదు నెలల పాటు ఖాళీగా ఉన్న మహేశ్.. వంశీ పైడిపల్లి సినిమాను పక్కన పెట్టి పరశురామ్ కు ఛాన్స్ ఇచ్చాడు. లాక్ డౌన్ టైమ్ లో స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసేశాడు దర్శకుడు.

 

సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ నెల 31న సినిమాను లాంఛనంగా మొదలుపెడుతున్నారు. మైత్రీ మూవీ మేకస్ నిర్మించే ఈ చిత్రానికి వినోద్ సినిమాటో గ్రఫీ అందించనున్నాడు. 

 

ఇంకా సెట్స్ పైకి రాని మహేశ్, పరశురామ్ చిత్రానికి సర్కార్ వారి పాట అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. వినడానికి విచిత్రంగా ఉన్న ఈ టైటిల్ పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. భరత్ అనే నేను మాదిరి మహేశ్ మరోసారి పొలిటికల్ టచ్ ఉన్న సినిమా చేస్తున్నాడా.. అనే అనుమానం కలుగుతోంది.

 

భరత్ అనే నేనులో సీఎంగా నటించిన మహేశ్.. సర్కార్ వారి పాటలో ఎలాంటి క్యారెక్టర్స్ పోషిస్తున్నాడనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే.. ఇది తెలంగాణ సర్కార్ వారి పాటా.. ఆంద్రా సర్కార్ వారి పాటా.. అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

మహేశ్, పరశురామ్ కాంబినేషన్ లో ఫస్ట్ టైమ్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. హీరోయిన్ రకరకాల పేర్లు వినిపించినా.. మరోసారి కియారాతో ఆడిపాడనున్నాడట.

 

కియారా భరత్ అనే నేనుతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. రెండో సినిమా వినయ విధేయ రామ ఫ్లాప్ కాగా.. మరోసారి మహేశ్ తోనే అధృష్టం పరీక్షించుకుంటోంది కియారా. 

మరింత సమాచారం తెలుసుకోండి: