తమిళ పరిశ్రమలో స్టార్ హీరోలుగా ఉన్న సూర్య, కార్తీ ఒకరి మీద ఒకరు గొడవకు దిగుతున్నారు. ఇద్దరు ఈగోలకు పోయి రగడ పెంచుకుంటున్నారు. ఇంతకీ వాళ్ళిద్దరి ఏ విషయంలో తేడా వచ్చింది.. నిజంగా సూర్య, కార్తీల మధ్య గొడవ మొదలైందా అంటే గొడవ మొదలవుతుంది కానీ అది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో అని అంటున్నారు. సూర్య, కార్తీ ఇద్దరు ఎవరికీ వారు తమ సినిమాలతో సత్తా చాటుతున్నారు. ఇద్దరు కలిసి మల్టీస్టారర్ సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నా కుదరలేదు. 

 

లేటెస్ట్ గా మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియం సినిమా చూసి ఇద్దరు ఆ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. పృథ్వి రాజ్, బిజూ మీనన్ నటించిన ఆ సినిమా ఇద్దరి ఈగోల మీద సినిమా నడుస్తుంది. ఆ రీమేక్ లో సూర్య, కార్తీ నటించాలని అనుకుంటున్నారు. అయితే పృద్వి రాజ్ పాత్రలో కార్తీ.. పోలీస్ ఆఫిసర్ రోల్ లో సూర్య నటించే అవకాశాలు ఉన్నాయట. ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు మిగతా స్టార్ కాస్ట్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. 

 

మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా కలిసి ఆ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. వెంకటేష్ ప్రస్తుతం అసురన్ రీమేక్ లో నటిస్తున్నాడు. నారప్ప టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత వెంకటేష్ త్రివిక్రమ్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. అది కూడా మల్టీస్టారర్ అని అంటున్నారు. సూర్య కార్తీ అక్కడ రీమేక్ చేస్తున్నారు అంటే అదే సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. మరి అయ్యప్పనుమ్ కోషియం తెలుగు డైరెక్ట్ రీమేక్ ఉంటుందా లేదా అన్న విషయం కూడా త్వరలో తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: