సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ లాక్ డౌన్ పీరియడ్ అంతా తన పిల్లలతో ఎంజాయ్ చేస్తూ వాటికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ కొనసాగుతున్న ఈ లాక్ డౌన్ పిరియడ్ ను తెగ ఎంజాయ్ చేసాడు. గత రెండు నెలలుగా కొనసాగుతున్న మహేష్ సరదాలకు ఇక బ్రేక్ పడే అవకాశం వచ్చింది. 


ఇప్పటికే మహేష్ పరుశు రామ్ తో చేయబోతున్న సినిమాకు లైన్ క్లియర్ చేయడంతో ఇప్పుడు ఆ మూవీ స్క్రిప్ట్ పూర్తిగా తయారు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఈ సినిమా మూలకథ గురించి ఇప్పడు ఫిలింనగర్ నుండి లీకులు వస్తున్నాయి. వేలకోట్లు అప్పులు తీసుకుని బ్యాంకులను ముంచుతూ విదేశాలకు పారిపోయే వారి బడాబాబుల మోసాల నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది అని సమాచారం.  


బ్యాంకింగ్ వ్యవస్థలోని లొసుగులను వాడుకుని వేలకోట్లు స్వాహా చేసే మోసగాళ్ళను అడ్డుకునే వ్యక్తిగా మహేష్ బాబు పాత్రను దర్శకుడు పరుశు రామ్ డిజైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో ఉన్న ట్రెండింగ్ టాపిక్స్ లో ఇది ఒకటి కాబట్టి ప్రేక్షకులకు చాలా సులువుగా ఈ మూవీ కథ కనెక్ట్ అవుతుంది అన్న నమ్మకం మహేష్ కు కలిగినట్లు టాక్.   


ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు 'సర్కారు వారి పాట' అనే టైటిల్ ను  ఫిక్స్ చేస్తున్నట్లు  వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా మే 31న లాంచ్ చేసి ఆరోజు పూజ కార్యక్రమాలు అదే విధంగా ఈ సినిమా టైటిల్ ప్రకటింప బోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కష్టాలలో ఉన్న  మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ఈ సినిమా ద్వరా ట్రాక్ లోకి రావాలని చాలా ఆశలు పెట్టుకుంది. అనేకమంది పేర్లు పరిశీలించిన తరువాత ఈ మూవీకి కైరా అద్వానీని  ఎంపిక అయినట్లు వార్తలు వస్తున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: