ప్రస్తుతం మన తెలుగులో కొందరు హీరోయిన్ లు మంచి స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్నారు. అందులో ప్రధానంగా చెప్పుకునే హీరోయిన్ లు రష్మిక మందన్న, పూజ హెగ్డే. వీరు ఇద్దరూ కూడా అవకాశాల కోసం చాలా ఆశగా ఎదురు చూసే స్థాయి నుంచి ఇప్పుడు వీరి తో ఒక్క సినిమా చేసినా చాలు అనుకునే స్థాయి వరకు వచ్చారు. ఎంత మంది కొత్త హీరోయిన్ లు వస్తున్నా ఆ ఇద్దరు మాత్రం తమ శైలిలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరు తమ రేటు కూడా భారీగా పెంచేశారు అన్న టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది.
ఇక ఇప్పుడు వీరు ఇద్దరికీ లక్కీ హీరోయిన్ లు అనే గుర్తింపు వచ్చింది అనేది టాలీవుడ్ జనాల మాట. ఈ సంక్రాంతికి వీరిద్దరు నటించిన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఇక రష్మిక భీష్మ కూడా మంచి హిట్ అయ్యింది. ఇద్దరూ కూడా ఆ గుర్తింపు తోనే దూసుకుపోతున్నారు. మహేష్ బాబు పూజ హెగ్డే ని లక్కీ హీరోయిన్ గా భావిస్తున్నాడు. ఎన్టీఆర్ కూడా పూజ విషయంలో దాదాపుగా ఇదే ఆలోచనలో ఉన్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక అతని తో పాటు పూజ విషయంలో రామ్ చరణ్ కూడా అదే ఆలోచనలో ఉన్నాడు అని సమాచారం.
ఆమె డాన్స్ చేసిన రంగస్థలం సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీంతో రామ్ చరణ్ ఇప్పుడు ఆమెకు మంచి గుర్తింపు ఇచ్చాడు అని... తన తర్వాత సినిమాలో ఆమె తప్పకుండా ఉండాలని అడిగాడు అని టాలీవుడ్ లో టాక్. ఇక రష్మిక విషయంలో కూడా ఇద్దరు హీరోలు ఇదే ఆలోచనలో ఉన్నారని సమాచారం. అందుకే ఇప్పుడు వారికి అంత డిమాండ్ అని తెలుస్తోంది. కేవలం స్టార్ హీరోలు మాత్రమే కాదు. మీడియం రేంజ్ హీరోలు సైతం ఇప్పుడు వీరిద్దరితో ఆన్ స్క్రీన్ రొమాన్స్కు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.