విజయ నిర్మల బయోపిక్ వస్తుంది అనే వార్త ఎప్పుడు అయితే టాలీవుడ్ లో వినపడిందో ఇక అక్కడి నుంచి కూడా ఆ సినిమా గురించి ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. సినిమా విడుదల కోసం ప్రేక్షకులు, ఆమె అభిమానులు కూడా బాగా ఎదురు చూస్తున్నారు. హడావుడి లేక ఆమె సూపర్ స్టార్ కాలేదు గాని ఆమె హీరోయిన్ గా దర్శకురాలి గా సాధించిన విజయాలు ఏ ఒక్కరు కూడా సాధించలేదు. ఓ మహిళా దర్శకురాలిగా ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించిన ఆమె ఏకంగా గిన్నీస్ రికార్డులోకి ఎక్కారు. విజయ నిర్మల తెలుగు సినిమాకే కాకుండా భారతీయ సినిమాకు చేసిన సేవలు ఎప్పటకీ భారతీయ సినిమా చరిత్రలో ప్రత్యేకంగా నిలిచి పోవడంతో పాటు ఆమెను ఓ ప్రత్యేకమైన మహిళగా నిలబెడతాయని చెప్పడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.
అందుకే ఇప్పుడు ఆమె బయోపిక్ విషయంలో ఇప్పుడు చాలా వరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆమె సినిమాను తీసుకుని రావడానికి టాలీవుడ్ లో ఇప్పుడు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఆమె పాత్రలో కీర్తి సురేష్ నటించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఆమె బయోపిక్ ను తెరకెక్కించేందుకు ఆమె కుమారుడు సీనియర్ నరేష్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మహానటిలో మెప్పించిన కీర్తి సురేష్ను విజయనిర్మల రోల్కు సంప్రదించగా ఆమె అందుకు ఓకే చెప్పినట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో కృష్ణ పాత్రలో మహేష్ బాబు నటిస్తాడు అని టాక్.
మహేష్ బాబు అందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని సినిమా షూటింగ్ సమయంలో మాత్రం కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని అతని చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి కాబట్టి అతను కాస్త జాగ్రత్తగా ఈ సినిమాకు డేట్స్ ఇచ్చే అవకాశం ఉందని టాక్. ఇక ఈ సినిమాలో కృష్ణ ఒక పాత్రలో కనపడతారు అని సమాచారం. మరి కృష్ణ ఈ సినిమాలో చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.