తెలుగు సినిమాకు గౌరవం తెచ్చిన తొలి తరం దర్శకుల్లో పి.పుల్లయ్యకు ప్రత్యేక స్థానం ఉంది. అద్భుత సినిమాలు నిర్మించి, తెరకెక్కించి తెలుగు సినిమాకు మంచి బాట వేశారు.  సినిమాలపై ఆయనకు మక్కువ ఎన్నో అద్భుత సినిమాలు రావడానికి కారణమైంది. 1935లో హరిశ్చంద్ర సినిమా ద్వారా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. పద్మశ్రీ పిక్చర్స్ బ్యానర్ స్థాపించి పలు హిట్ సినిమాలు కూడా తీశారు. ధర్మపత్ని, అర్ధాంగి, శ్రీ వెంకటేశ్వర మహత్యం, సిరి సంపదలుతోపాటు మరికొన్ని సినిమాలు ఆయన నిర్మాణంలో వచ్చాయి. నేడు ఆయన వర్ధంతి.

IHG

 

పుల్లయ్య 1937లో సారంగధర అనే సినిమాకు దర్శకత్వం వహించారు. రాజరాజ నరేంద్రుడి చారిత్రక కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. అప్పట్లో ఈ సినిమాకు మంచి పేరు వచ్చింది. ఇదే సినిమా రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ తెలుగు, తమిళంలో వేరే దర్శకులు తెరకెక్కించారు. 1941లో దర్శక, నిర్మాతగా ధర్మపత్ని సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో పి.శాంత కుమారి, భానుమతి తదితరులు నటించారు. అప్పటికే పి.శాంత కుమారిని పుల్లయ్య వివాహమాడారు. 1941లో సుభద్ర అనే కన్నడ సినిమా కూడా తీశారు. 1945లో పుల్లయ్య తెరకెక్కించిన మాయా మశ్చీంద్ర సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. అప్పటికే వివిధ భాషల్లో వచ్చిన ఆరు సినిమాల ఇతివృత్తం తీసుకుని తెరకెక్కించారు.

IHG

 

1955లో తీసిన అర్ధాంగికి ఉత్తమ చిత్రంగా అవార్డు వచ్చింది. అక్కినేనితో 1959లో తెరకెక్కించిన జయభేరి పుల్లయ్యకు మంచి పేరు తీసుకొచ్చింది. జయభేరికి ఉత్తమ చిత్రంగా అప్పట్లో మెరిట్ సర్టిఫికెట్ కూడా వచ్చింది. పుల్లయ్యకు కూడా పలు అవార్డులు వచ్చాయి. 1960లో ఎన్టీఆర్ తో శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమా తీశారు. 1962లో తీసిన సిరిసంపదలుకు ఉత్తమ చిత్రంగా మెరిట్ సర్టిఫికెట్ వచ్చింది. తెలుగు సినిమా పురోగతికి పుల్లయ్య చూపిన దారి ఎంతో దోహదపడిందనే చెప్పాలి. ఎన్నో క్లాసిక్స్ అందించిన పుల్లయ్య 1985 మే29న మరణించారు.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: