భారతీయ చలన చిత్ర రంగంలో తన అందాలతో కోట్ల మంది కుర్రాళ్ల హృదయాలు కొల్లగొట్టింది అతిలోక సుందరి శ్రీదేవి. ఎన్టీఆర్,ఏఎన్ ఆర్ లతో నటించిన ఆమె వాళ్ల తనయుల జనరేషన్ లో వచ్చిన నాగార్జున, వెంకటేష్, చిరంజీవి లాంటి హీరోలతో నటించి మెప్పించింది. తమిళంలో బాలనటిగా రంగ ప్రవేశం చేసిన శ్రీదేవి తర్వాత హీరోయిన్ గా ఎదిగింది. పలు భాషల్లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శ్రీదేవి తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లింది. అక్కడ స్టార్ ప్రొడ్యూసర్ బోనికపూర్ ని వివాహం చేసుకుంది. ఈ జంటకు జాన్వీ, ఖుషీ కపూర్ లు జన్మించారు. ఎవరూ ఊహించని విధంగా సీనీ పరిశ్రమలోకి రీ ఎంట్రీ ఇచ్చి మంచి ఫామ్ లోకి వస్తున్న తరుణంలో దుబాయ్ లో కన్నుమూశారు శ్రీదేవి.
ఆమె కూతురు జాన్వీ కపూర్ అప్పటికే ధడక్ సినిమాలో నటిస్తుంది. కానీ తన కూతురుని హీరోయిన్ గా వెండితెరపై చూసుకోకుండానే తనువు చాలించింది. అయితే జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం కేవలం హిందీ సినిమాల్లోనే నటిస్తోంది. ఈ అయితే లాక్డౌన్ విరామ సమయంలో ఆమె ముంబయిలో తండ్రి బోనీకపూర్, సోదరి ఖుషీతో కలిసి గడుపుతోంది. జాన్వీకపూర్ మాట్లాడుతూ “గత రెండేళ్ల నుంచి ఇన్ని రోజుల విరామం ఎప్పుడూ దొరకలేదు.
నాన్న, సోదరి యోగక్షేమాలు దగ్గరుండి చూసుకునే అవకాశం దక్కింది. మొదటి నుంచి నేను అమ్మ గారాబంతో పెరిగాను.. నాది చిన్నపిల్లల మనస్తత్వం. అయితే మొదటి నుంచి పెద్దగా కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచించేదాన్ని కాదు. ఇప్పుడు నాన్న ఎలాంటి భోజనం తీసుకుంటున్నారు? ఖుషీ తన టైమ్ను ఎలా సద్వినియోగం చేసుకుంటోంది? ఇంట్లో పనివాళ్లు శుభ్రత పాటిస్తూ కరోనా సంక్రమించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఇలా ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకుంటున్నా. మొత్తానికి లాక్ డౌన్ లో నా కుటుంబ బాధ్యత బాగా తెలిసి వచ్చేలా చేసింది అంటుంది జాన్వీ కపూర్.