టాలీవుడ్ లో ఈ మద్య కొత్త జోరు కొనసాగిస్తున్నారు.  రాంగోపాల్ వర్మ శిష్యుడు విజయ్ భూపతి దర్శకత్వంలో కొత్త నటుడు కార్తికేయ హీరోగా ‘ఆర్ ఎక్స్ 100’ సినిమా లో హీరోయిన్ గా నటించిన పాయల్ రాజ్ పూత్ బోల్డ్ గా నటించి కుర్రాళ్ల మనసు కొల్లగొట్టింది.  దాంతో పాయల్ రాజ్ పూత్ కి వరుసగా ఛాన్సులు రావడం మొదలు పెట్టాయి. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో కొన్ని సినిమాల్లో ఛాన్సు కొట్టేసింది.  ఈ మద్య రిలీజ్ అయిన ‘సీత’సినిమాలో ఐటమ్ సాంగ్ లో కూడా నటించింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తున్న స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వర్ రావు(1970 - 80 కాలానికి చెందిన వ్యక్తి) జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో పాయల్ నటిస్తోంది. ఈ సినిమాలో పాయల్ వేశ్య పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.

 

ఈ బయోపిక్ లో వేశ్య పాత్ర కోసం చాలా మందిని అనుకున్నప్పటికీ చివరికి రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ని సెలెక్ట్ చేసుకున్నారు. దొంగాట,  కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన వంశీ కృష్ణ ఈ బయోపిక్ ని తెరకెక్కిస్తున్నాడు.  ఇటీవ‌ల‌  ప్రియుడు సౌరభ్‌ ధింగ్రా  దర్శకత్వం వహించిన ఓ లఘు చిత్రంలో నటించింది పాయల్‌రాజ్‌పుత్‌. ‘ఏ రైటర్‌' పేరుతో రూపొందించిన ఈ షార్ట్‌ఫిల్మ్‌ను కేవలం 24 గంటల్లో చిత్రీకరించారు. దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా జీనియ‌స్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న ఇండియ‌న్ 2 సినిమా ఆఫ‌ర్ ద‌క్కించుకుంద‌ట పాయ‌ల్‌. చిత్రంలో స్పెష‌ల్ సాంగ్ కోసం పాయ‌ల్ రాజ్‌పుత్‌ని తీసుకోవాల‌ని శంక‌ర్ భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

 

త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది. గత కొన్ని రోజులుగా ఇండియన్ 2 మూవీ షూటింగ్ విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.  996లో వ‌చ్చిన  ఇండియ‌న్ చిత్రానికి సీక్వెల్‌గా ఇండియ‌న్ 2 చిత్రం తెర‌కెక్కుతుండ‌గా, ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సిద్ధార్ధ్ కీల‌క పాత్ర‌లో కనిపించ‌నున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: